ఒక లీటర్ పెట్రోల్ తో 50 కిలోమీటర్ల మైలేజ్ వస్తే మనం మహా ఆనందపడిపోతాం అలాంటిది నందిగాంకి చెందినా ఒక బైక్ మెకానిక్ కొత్త ప్రయోగంతో ఒక లీటర్ పెట్రోల్ తో 100 కిలోమీటర్ల మైలేజ్ వచ్చే పద్ధతిని కనిపెట్టాడు.
నందిగాం కి చెందినా గిరిబాబు అనే వ్యక్తి తండ్రి వ్యవసాయ కూలీ, తల్లి టైలర్ పని చేస్తుంటారు, గిరిబాబు పదో తరగతిని మధ్యలోనే వదిలేసి 7 సంవత్సరాల పాటు బైక్ మెకానిక్ పని నేర్చుకొని నందిగాం లోనే ఒక బైక్ మెకానిక్ షెడ్ ని నడిపిస్తున్నాడు,తన ఆలోచనలతో 50 నుండి 60 కిలోమీటర్ల మైలేజ్ వచ్చే వాహనానికి మరో నాలుగు చైన్ వీల్స్ అమర్చడం ద్వారా వాహన మైలేజ్ ని 90 నుండి 100 కిలోమీటర్ల వరకు పెంచాగలిగాడు, చైన్ వీల్స్ ని విశాఖ పట్నం నుండి ప్రత్యేకంగా తెప్పించి మరో రెండు గేర్లని తయారుచేసి వాహనికి అమర్చి మైలేజ్ ని పెంచుతానని గిరిబాబు తెలిపాడు.
గిరిబాబు ఆలోచనని చూసిన వాహన యజమానులు గిరిబాబుకి ప్రయోగానికి ఆర్థికంగా సహాయం చేయదినికి ముందుకొచ్చారు, ఇలాంటి వారికి ప్రభుత్వం తగిన ప్రోత్సాహం ఇస్తే ఇంకా మరిన్ని పరికరాలు కనిపెట్టే ఆవకాశం ఉందని అక్కడి ప్రజలు అభిప్రాయ పడుతున్నారు .
Must Read: పెట్రోల్ బంక్ లో ఫుల్ ట్యాంక్ కొట్టిస్తున్నారా?.. హుషారుగా ఉండండి!