పాకిస్థాన్లోని పేషావర్ సమీపంలో 300 సంవత్సరాల నాటి సిక్కుల పవిత్ర పార్థనా మందిరమైన గురుద్వారా 73 ఏళ్ళ తర్వాత తిరిగి తెరుచుకుంది. ఈ సందర్భంగా పాకిస్తాన్ ప్రభుత్వ పటిష్ట భద్రత మధ్య సిక్కు మత పెద్దలు ప్రార్థనలు నిర్వహించారు. సిక్కుల అతి పురాతన మందిరాలలో ఒకటైన ఈ గురుద్వారా 1940లో మూతపడింది. 40, 50 వ దశకం లోని రాజకీయ కారణాల వలనా, దేశ విభజన మూళం గానూ ఆ రోజుల్లో ఇక్కడి సిక్కులు ఇండియాకి తరలిపోయారు. పాక్ ప్రభుత్వం దీన్ని స్వాధీనం చేసుకుని అనేక రకాలుగా వినియోగించుకుంది. అయితే దీన్ని పున:ప్రారంభించాలంటూ పాక్లో మైనార్టీకి చెందిన సిక్కులు ఎన్నో ఏళ్ళుగా పోరాడుతూనే ఉన్నారు . చివరకు 7 దశాబ్దాలకి వారి కల ఫలించింది.
అంతా సమసిపోయింది అనుకుంటున్న తరుణంలో ఇప్పుడు ఉగ్రవాదుల నుంచి ముప్పు పొంచి ఉండటంతో భయాందోళన చెందుతున్నారు. ఇది ఇలా ఉండగా, స్థానిక ముస్లింలు కూడా గురుద్వారాపై దాడి అనివార్యమని భావిస్తున్నారు. తాజాగా ఓ సిక్కు మతానికి చెందిన సర్దార్ సురన్ సింగ్ను ఉగ్రవాదులు హత్య చేయడం కలకలం రేపుతోంది. ఏది ఏమైనా పాక్ లో ఓ సిక్కు ఆలయానికి అండగా నిలిచిన పాకిస్తానీయులు అభినందనీయులు కదా. భారత్, పాక్ స్నేహ సంభందాలకు ఓ అడుగు ముందుకేసినందుకు, భారత్ పాక్ భాయి భాయ్ అని ప్రపంచమంతా చెప్పుకునే రోజులని దగ్గరకి తెస్తున్నందుకు.
(Visited 1,140 times, 1 visits today)