సాక్షి మాలిక్, పీవీ సింధులు దేశానికి ఒలింపిక్స్ పతకాలు తెచ్చి గర్వపడేలా చేసారు, ఇప్పుడు వారి బాటలోనే మరో అమ్మాయి ఒలింపిక్స్ పతక వేటలో ఫైనల్ రౌండ్ కి చేరింది, అదితి అశోక్ ఈ పేరు మనలో చాలా మందికి తెలియదు, కానీ గోల్ఫ్ లో ఫైనల్ రౌండ్ కి చేరడంతో అదితి పేరు మారుమ్రోగిపోతుంది, మన దేశంలో ఎక్కువ ప్రాధాన్యత లేని గోల్ఫ్ ఆటలో అదితి ప్రపంచ శ్రేణి క్రీడాకారిణిలని ఓడించి ఫైనల్ రౌండ్ కి చేరింది, కేవలం 18 ఏళ్ళ వయసులోనే అదితి ఈ ఘనత సాధించింది.
ఈరోజు జరగబోయే ఫైనల్ రౌండ్ లో అదితి ఒలంపిక్ పతకం కోసం పోటీపడుతోంది, సాక్షి మాలిక్, పీవీ సింధుల పతకాల వేటని కొనసాగిస్తూ అదితి అశోక్ మరో పతాకాన్ని గెలవాలని దేశం మొత్తం కోరుకుంటుంది.