పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్ తో పాటు సినీ అభిమానులంతా ఎన్నో అంచనాలతో ఎదురుచూస్తున్న సినిమా అజ్ఞాతవాసి మరికొద్ది గంటల్లో మన తెలుగు రాష్ట్రాల్లో విడుదల కాబోతుంది, కానీ ఇప్పటికే అనేక దేశాల్లో ప్రీమియర్ షో లని ఒకరోజు ముందుగానే వేసేసారు, అమెరికాలో అయితే ప్రీ బుకింగ్ లలో హాలీవుడ్ సినిమాలని వెనక్కినెట్టి మరి అజ్ఞాతవాసి ముందు వరుసలో నిలిచింది, ఇక తెలుగు రాష్ట్రాలలో కూడా అడ్వాన్స్ బుకింగ్ లతోనే రికార్డు కొట్టేలా ఉంది.
ఈ సినిమాని చూసిన ప్రముఖ సినీ విశ్లేషకుడు ఉమేర్ సంధూ మొదటి రివ్యూను ట్విట్టర్ లో పోస్ట్ చేసాడు, అజ్ఞాతవాసి లో పవన్ కళ్యాణ్ ఫెర్ఫార్మెన్స్ వన్ మ్యాన్ షో అని, హీరోయిన్లుగా కీర్తి సురేష్, అను ఇమ్మాన్యుయేల్ ఫెర్ఫార్మెన్స్, గ్లామర్ అదనపు ఆకర్షణగా ఉండి, కేవలం మెగా అభిమానులనే కాదు.. ఫ్యామిలీ ఆడియెన్స్ను మెప్పించే ఎన్నో అంశాలు అజ్ఞాతవాసి చిత్రంలో ఉన్నాయని. పవన్ కల్యాణ్ చేసిన ఫైట్స్ తెర మీద దిమ్మతిరిగేలా ఉన్నాయని. సినిమాటోగ్రఫీ, తివిక్రమ్ డైరెక్షన్ అదిరిపోయేలా ఉందని, ఇంకా అనిరుద్ చేసిన మ్యూజిక్ సూపర్బ్ గా ఉందని మొత్తానికి అటు మాస్ కి, ఇటు క్లాస్ కి నచ్చేలా ఉందని ఉమైర్ సంధూ తన వెబ్ సైట్ లో పోస్ట్ చేసాడు.
EXCLUSIVE First Detail Review of #Agnyaathavaasi in the World ! Powerstar #PawanKalyan Steals the Show all the way. Full on Family Entertainer ! BLOCKBUSTER. ☆☆☆☆ ! https://t.co/nds9o5QygW
— Umair Sandhu (@sandhumerry) January 8, 2018