ఇంతకుముందు టాలీవుడ్ లో స్టార్ హీరోల సినిమాలు కొన్ని విడుదల అయిన తరువాత వచ్చే కలెక్షన్స్ వంద కోట్ల మార్కు దాటేవి, ఇప్పుడు సినిమా విడుదల కాకముందే ప్రీ రిలీజ్ బిజినెస్ లో కూడా వంద కోట్ల మార్కు ఈజీగా దాటేస్తున్నాయి, ఇప్పుడు పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ హీరోగా త్రివిక్రమ్ డైరెక్షన్ లో ఈ సంక్రాంతికి విడుదల అవుతున్న అజ్ఞాతవాసి సినిమా కూడా విడుదలకి ముందే వంద కోట్ల మార్కుని దాటేసింది.
పవన్ కళ్యాణ్, త్రివిక్రమ్ కాంబినేషన్ కావడంతో అజ్ఞాతవాసి ప్రీ రిలీజ్ బిజినెస్ పెద్ద మొత్తంలో జరిగింది, డిస్ట్రిబ్యూటర్లు అన్ని ఏరియాల్లో ఫ్యాన్సీ రేట్లకి అజ్ఞాతవాసి సినిమాని కొనుక్కున్నారు, సినిమా హిట్ అయితే బాక్స్ ఆఫీస్ షాక్ అవ్వడం గ్యారెంటీ అనే నమ్మకంతోనే సినిమాని ఎక్కువ రేట్ అయిన కొనుక్కున్నట్లు డిస్ట్రిబ్యూటర్లు తెలిపారు, అజ్ఞాతవాసి సినిమాకి ఏపీ, తెలంగాణ వరకు 90 కోట్లకి పైగా, ఇండియా మొత్తం కలిపి 105 కోట్లకి పైగా ప్రీ రిలీజ్ బిజినెస్ జరిగింది, శాటిలైట్, ఆడియో రైట్స్ కలిపితే మొత్తంగా రూ.150 కోట్లకి పైనే బిజినెస్ చేసి జరిగింది.
నైజాం – రూ.30 కోట్లు
సీడెడ్ – రూ.16+ కోట్లు
UA – రూ.12+ కోట్లు
గుంటూరు – రూ.9 కోట్లు
ఈస్ట్ – రూ.8+ కోట్లు
కృష్ణ – రూ.7 కోట్లు
వెస్ట్ – రూ.6+ కోట్లు
నెల్లూరు – రూ.4+ కోట్లు
ఏపీ – తెలంగాణ – రూ.92+ కోట్లు
కర్ణాటక + తమిళనాడు + నార్త్ ఇండియా – రూ.12+ కోట్లు
శాటిలైట్ – రూ.32 కోట్లు
ఆడియో – రూ.2 కోట్లు
మొత్తం – రూ.150+ కోట్లు.