ఆకాశంలో ఎగురుతున్న విమానాన్ని చూసి సంబరపడి ఎప్పుడు ఎక్కాలా…! అని ప్రతి పేద, మధ్య తరగతి వారు అనుకుంటారు. బాహుషా ఆ కోరిక త్వరలో తీరనుందనుకుంటా. ఎప్పుడు విమానం వలె ఆకాశం మీద ఉండే విమాన చార్జీలు ఇకపై సామాన్యుడు సైతం ప్రయాణించేల చౌక ధరలకే విమానయానాన్ని ఎయిర్ ఏషియా అందించబోతుంది.
ప్రయాణికుల్ని ఆకట్టుకునేందుకు ఎయిర్ ఏషియా కొత్త ఆఫర్ అందించనుంది. ముందస్తు బుకింగ్ చేసుకునే వారికి రూ.599 ప్రారంభ ధరతో భారీ డిస్కౌంట్ ప్రకటించింది. ఈ ఆఫర్ సెప్టెంబర్ 11 వరకు అందుబాటులో ఉండనుంది. అలాగే 2017, ఫిబ్రవరి 6 నుండి 2017 అక్టోబర్ 28 మధ్య దేశీయ మార్గాల్లో ప్రయాణించే వారికి ఈ ఆఫర్ వర్తిస్తుందని సంస్థ తెలిపింది. దీని ప్రకారం గువాహటి-ఇంఫాల్ కు అన్ని చార్జీలు కలపి రూ.599 టికెట్ ధరగా నిర్ణయించింది. అలాగే బెంగుళూరు నుంచి కోచికి రూ.899, గోవాకు రూ.1,099, వైజాగ్ కి రూ.1,199, ఢిల్లీకి రూ. 2,299, పూణెకి రూ. 1,299 గా టికెట్ ధరలు ఉండనున్నాయి. అయితే ఈ ఆఫర్ కింద ఎన్ని సీట్లు కేటాయించబోతుందన్నది ఎయిర్ ఏషియా ఇంకా ప్రకటించలేదు.