పాపం అల్లరి నరెష్ ఈ మధ్య ఎది టచ్ చేసినా ఫ్లాప్ అవుతోంది. వరుస ఫ్లాప్ లతొ కొట్టు మిట్టాడుతున్న అల్లరి నరెష్ ని రీసెంట్గా వచ్చిన ‘జేమ్స్బాండ్’ చిత్రం కూడా పరాజయాల నుండి బయట పడవేయలేకపోయింది. కాగా ప్రస్తుతం అల్లరి నరేష్ మోహన్బాబుతో కలిసి ‘మామ మంచు.. అల్లుడు కంచు’ అనే చిత్రంలో చేస్తున్నాడు. ఈ చిత్రం కూడా ఓ మరాఠి చిత్రానికి రీమేక్గా తయారవుతోంది. తాజాగా అల్లరి నరెష్ మరో రీమేక్ చిత్రానికి గ్రీన్సిగ్నల్ ఇచ్చినట్లు సమాచారం. కన్నడలో విజవంతమైన ‘విక్టరీ’ అనే చిత్రాన్ని తెలుగులోఅల్లరి నరెష్ తో తీయడానికి ప్లాన్ చేస్తున్నారు. గతంలో ‘సిద్దూ ఫ్రమ్ శ్రీకాకుళం’ చిత్రానికి దర్శకత్వం వహించిన ఈశ్వర్రెడ్డి ఈ చిత్రానికి దర్శకత్వం వహిస్తుండగా, చలసోరి రామబ్రహ్మం తమ గోపీఆర్ట్స్ బేనర్పై నిర్మించనున్నాడు. వాస్తవానికి దర్శకనిర్మాతలు తొలుత ఈ చిత్రాన్ని సునీల్తో రీమేక్ చేయాలని భావించారు. కానీ ఈ చిత్రంలోని సన్నివేశాలు ఎప్పుడో తెలుగులో వచ్చిన సన్నివేశాలను పోలివుండటం, ఆల్రెడీ ఈ సినిమాలోని క్లైమాక్స్ సునీల్ నటించిన ‘భీమవరం బుల్లోడు’లో వాడుకొని ఉండటం మూలంగా దీనిపై సునీల్ ఆసక్తి చూపలేదు. మరి ఈ ‘విక్టరీ’ రీమేక్ అల్లరి నరెష్ కు ఎలాంటి అనుభవాన్ని మిగిలిస్తుందో వేచిచూడాల్సివుంది…! అయినా అసలే ఫ్లాప్ లతో అర్థం కాని పరిస్థితి. మరి సునీల్ కూదా నో అన్న ప్రాజెక్ట్ లో అల్లరి నరెష్ కి ఎం నచ్చిందో.. ఎంటో?..
(Visited 59 times, 1 visits today)