Home / Inspiring Stories / పదో తరగతి ఫలితాలు విడుదల.

పదో తరగతి ఫలితాలు విడుదల.

Author:

ap-10th-results

ఆంధ్రప్రదేశ్‌లో పదో తరగతి పరీక్షా ఫలితాలు ఈరోజు విడుదలయ్యాయి. విశాఖపట్నంలో విద్యాశాఖ మంత్రి గంటా శ్రీనివాసరావు ఈ ఫలితాలను విడుదల చేశారు. అధికారులు, ఉపాధ్యాయుల కృషితో రికార్డుస్థాయిలో అత్యంత వేగంగా ఫలితాలను విడుదల చేసినట్లు మంత్రి తెలిపారు.

బాలికలదే హవా
ఆంధ్రప్రదేశ్‌ పదో తరగతి పరీక్ష ఫలితాల్లో 94.52 శాతం ఉత్తీర్ణత నమోదైంది. పదో తరగతి ఫలితాల్లో బాలురు కంటే బాలికలు స్వల్పంగా ఆధిక్యం సాధించారు. పదో తరగతి పరీక్షలకు 6,17,030 మంది విద్యార్థులు హాజరుకాగా 5,83,266 మంది పాసైనట్లు మంత్రి తెలిపారు. మొత్తం 6,52,374 మంది విద్యార్థులు పరీక్ష రాయగా… 5,83,266 మంది రెగ్యులర్‌ విద్యార్థులు, 19,605 మంది ప్రైవేటు విద్యార్థులు ఉత్తీర్ణులయ్యారు. ఉత్తీర్ణత శాతం 94.77గా నమోదైంది. గతేడాది కంటే ఉత్తీర్ణత 3 శాతం పెరిగింది.

ఫలితాల్లో కడప(98.8 శాతం) జిల్లా అగ్రస్థానంలో నిలిచింది. పశ్చిమగోదావరి (97.65 శాతం), తూర్పుగోదావరి(97.59 శాతం) రెండు, మూడు స్థానాల్లో నిలిచాయి. గతేడాది మాదిరిగానే చిత్తూరు జిల్లా (90.11) ఆఖరి స్థానంలో నిలిచింది.

Results Links:

(Visited 848 times, 1 visits today)