అవినీతి వ్యతిరేక ఉద్యమకారుడు అన్నా హజారే ఒకప్పటి తన అనుచరుడు, ప్రస్తుత ఢిల్లీ సిఎం అరవింద్ కేజ్రీవాల్ పై సంచలన వ్యాఖ్యలు చేశాడు. కేజ్రీవాల్ పై పెట్టుకున్న ఆశలు అడియాశలయ్యాయని అన్నా ఆవేదన వ్యక్తం చేశారు. కేజ్రీ ప్రభుత్వంలోని కొందరు మంత్రులు జైలుకెళ్లడం, మరికొందరిపై అవినీతి ఆరోపణలు రావడం పట్ల తనకెంతో బాధగా ఉందని వాపోయారు.
కేజ్రీవాల్ తనతో ఉన్నపుడు గ్రామ స్వరాజ్ అనే పుస్తకాన్ని రాశాడు. ఇదేనా గ్రామస్వరాజ్ అంటే ? అని హజారే ప్రశ్నించారు. దేశంలో అయన సరికొత్త ఒరవడిని తీసుకువస్తారని కళలు కన్నానని, అది చివరికి అడియాశగా మిగిలిందని అన్నారు. కేజ్రీ పార్టీ పెట్టినప్పుడు పార్టీలోకి ఎలాంటి వ్యక్తులొస్తున్నారో నిశితంగా పరిశీలించుకోవాలని అప్పుడే హెచ్చరించానన్నారు. పార్టీలోకి వస్తున్న వ్యక్తుల్ని మంచి వారా లేదా అన్నా విషయాన్నీ ఎలా గుర్తిస్తావు అని అడిగినప్పుడు కేజ్రీవాల్ సమాధానం చెప్పలేకపోయారని అన్నా అన్నారు. ప్రస్తుత పరిణామాలతో కేజ్రీవాల్ పాలనపై నమ్మకం పోయిందని అన్నాహజారే స్పష్టం చేశారు.