సాఫ్ట్ వేర్ ఇంజనీర్ గా ఉద్యోగం అంటే లక్షల్లో జీతాలు, అంతర్జాతీయ ఆఫీస్ లు, విలాసవంతమైన జీవితం అని అందరికి తెలిసిందే, ఐటీ ఉద్యోగంలో చేరితే ఇట్టే సెటిల్ అయిపోవచ్చు అన్న సంగతి, వారికొచ్చే జీతల గురుంచి తెలిసి కూడా ఒక ఆటో డ్రైవర్ ఒక సాఫ్ట్ వేర్ ఉద్యోగి దగ్గర చార్జీ తీసుకోకుండా ఫ్రీ గా డ్రాప్ చేసిన సంఘటన బెంగుళూరులో జరిగింది, ఆటో డ్రైవర్ ఐటీ ఉద్యోగిని ఫ్రీగా ఎందుకు డ్రాప్ చేసాడు.. అన్న సంగతి ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. అసలు విషయం ఏంటంటే…
మన దేశానికి ఐటీ రాజధాని అయిన బెంగుళూరులో ఒక సాఫ్ట్ వేర్ సంస్థకి చెందిన ఓ ఐటీ ఉద్యోగి 5 కిలోమీటర్ల దూరంలో ఉన్న తన ఇంటికి ఓ ఆటోలో వెళ్లాడు. ఆ ఆటో డ్రైవర్ ఆటో చార్జీ రూ.200 చెల్లించమని అడిగాడు. కేవలం 5 కిలోమీటర్ల దూరానికి రూ.200 చాల ఎక్కువ, తక్కువ చేయమని ఆ ఐటీ ఉద్యోగి ఆ ఆటోడ్రైవర్ను అడిగాడు. ఎంతసేపు అడిగిన ఆ ఆటో డ్రైవర్ ఆటో చార్జి మొత్తం రూ.200 ఇవ్వాల్సిందేనని పట్టుబడ్డాడు. దీంతో ఆ ఐటీ ఉద్యోగి చేసేదేం లేక ఏం చూపించాడో తెలుసా..? జేబులోంచి తన శాలరీ పే స్లిప్ తీసి ఆ ఆటో డ్రైవర్ కి చూపించాడు. దీంతో ఆ ఆటో డ్రైవర్ ఒక్క మాట కూడా మాట్లాడకుండా, రూ.200 చార్జి తీసుకోకుండానే వెళ్లిపోయాడు.
అయితే సదరు ఐటీ ఉద్యోగి చూపించిన శాలరీ పే స్లిప్ లో అతనికి వచ్చే జీతం ఎంత ఉందో తెలుసా..? రూ.27,083. అవును, నిజమే. దాన్ని చూసి ఆ ఆటోడ్రైవర్ తనకు రావల్సిన రూ.200 వదులుకుని ఫ్రీ రైడ్ కింద ఆ ఐటీ ఉద్యోగిని వదిలి పెట్టాడు. ఏంటీ..ఆ ఐటీ ఉద్యోగి జీతం బాగానే ఉంది కదా. ఎందుకు విడిచిపెట్టాడు. రూ.200 కాకపోయినా, కనీసం అందులో సగం రూ.100 అయినా తీసుకోవచ్చు కదా.. అని మీకు డౌట్ వచ్చే ఉంటుంది. కానీ.. అక్కడే ఓ ట్విస్ట్ ఉంది. అదేమిటంటే.. ఆ ఐటీ ఉద్యోగి పే స్లిప్ను చూశాక ఆ ఆటోడ్రైవర్ ఏమన్నాడంటే.. తనకు వారం రోజులు ఆటో నడిపితే ఆ ఐటీ ఉద్యోగికి వచ్చే నెల జీతం అంత డబ్బు వస్తుందట. మరి ఇప్పుడు ఎవరి సంపాదన ఎక్కువ అవుతుంది చెప్పండి. అందుకనే ఆ ఆటోడ్రైవర్ ఆ ఐటీ ఉద్యోగిని వదిలి పెట్టాడు. ఈ క్రమంలో వీరిద్దరి మధ్య జరిగిన ఈ విషయం నెట్లో వైరల్ అవుతోంది..! ఏది ఏమైనా.. ఇది నిజమే కదా..! ఒక్కోసారి ఇలా జరుగుతూ ఉంటుంది. అందుకు ఎవరూ ఏమీ చేయలేరు..!