ప్రత్యేక తెలంగాణ కోసం తెలంగాణ ప్రజలు 60 ఏళ్ళు ఎన్నో ఉద్యమాలు చేసి సాధించుకున్నారు, మలిదశ ఉద్యమంలో కెసిఆర్, కోదండరాం లాంటి నాయకుల ఆధ్వర్యంలో అన్ని పార్టీలు, తెలంగాణ ప్రజలంతా ఏకతాటిపైకి వచ్చి తెలంగాణాని సాధించుకున్నారు, కాంగ్రెస్ ప్రభుత్వం తెలంగాణ ఇచ్చిన క్రెడిట్ కొట్టాయాలనే తొందరలో విభజన తరువాత ఆంధ్ర ప్రదేశ్ కి ఎదురయ్యే సమస్యల గురుంచి ఆలోచించలేదు, అప్పటి ప్రధాని పార్లమెంట్ సాక్షిగా ఆంధ్ర ప్రదేశ్ కి 5 సంవత్సరాలు ప్రత్యేక హోదా ఇస్తాం అని చెప్పారు, రాజ్యసభలో వెంకయ్య నాయుడు ఐదు కాదు పది సంవత్సరాలు ప్రత్యేక హోదా ఇవ్వాలని చెప్పాడు, ఆ మాట ప్రకారమే ఎన్నికల ప్రచారానికి వచ్చిన నరేంద్ర మోడీ ఆంధ్ర ప్రదేశ్ కి ప్రత్యేక హోదా ఖచ్చితంగా ఇస్తాం అనే హామీ ఇచ్చారు, ఆ మాటలను నమ్మే ఆంధ్ర ప్రదేశ్ ప్రజలు ఎన్డీయే కూటమికి విజయాన్ని కట్టబెట్టారు.
కేంద్రంలో సొంత మెజారిటీతో అధికారంలోకి వచ్చిన మోడీ ప్రభుత్వం ఆంధ్ర ప్రదేశ్ ఇవ్వాల్సిన ప్రత్యేక హోదా హామీని పెడచెవిన పెట్టింది, అదిగో ఇస్తున్నాం..,ఇదిగో ఇస్తున్నాం అని ఆశలు రేపి చివరికి ఒక ప్యాకెజీని ప్రకటించారు. ఆ ప్యాకెజీని తిరస్కరించాల్సిన రాష్ట్ర ప్రభుత్వం ప్రత్యేక హోదా కంటే ప్రత్యేక ప్యాకెజీ ద్వారానే ఎక్కువ లాభం జరుగుతుంది అనే మాయ మాటలు చెప్పి ప్రజలని నమ్మించారు, తమిళనాడులో జల్లికట్టు ఆడటాన్ని నిషేధించినందుకు అక్కడి యువతీ యువకులంతా కలిసి చెన్నైలో ఉన్న మెరీనా బీచ్ లో శాంతియుతంగా నిరసన తెలియజేసి కేంద్ర ప్రభుత్వం దిగి వచ్చి ఆర్డినెన్స్ ఇచ్చేలా చేసారు, ఆ ఉద్యమాన్ని స్ఫూర్తిగా తీసుకోని ఆంధ్ర ప్రదేశ్ ప్రజలు ముఖ్యంగా యువకులు జనవరి 26 వ తేదీన వైజాగ్ లో ఉన్న ఆర్కే బీచ్ వద్ద ప్రత్యేక హోదా సాధించేవరకు నిరసన చేయాలనీ ముందుకు కలుగుతున్నారు , వీరికి జనసేన అధ్యక్షుడు పవన్ కళ్యాణ్ తో పాటు చాలామంది సినీ ప్రముఖులు మద్దతు ప్రకటించారు.
కానీ వీరి పోరాటానికి అడ్డు తగిలేలా కొన్ని శక్తులు పని చేస్తున్నాయి, ప్రత్యేక హోదా వల్ల వచ్చేది ఏమి లేదు అని ప్రజలని మభ్య పెట్టాలని చూస్తున్నాయి, అలాంటి వారి మాటలు నమ్మకుండా ఉండాలంటే ప్రత్యేక హోదా వస్తే ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్రానికి కలిగే ప్రజయోజనాలు ఏంటో ప్రజలందరికి తెలియాలని ప్రత్యేక హోదా వల్ల కలిగే లాభాలని మీ కోసం ఆర్టికల్ రూపంలో అందిస్తున్నాం, ఈ విషయాలని అందరికి తెలిసేలా షేర్ చేసి ప్రత్యేక హోదాని సాధిధ్ధాం.
ఇప్పటికైనా మేల్కొని కులం, వర్గం అనే గోడలని బద్దలుకొట్టి ఆంధ్ర ప్రదేశ్ భవిష్యత్ కోసం పోరాటంలో భాగ్యస్వామ్యం అయ్యి ప్రత్యేక హోదాని సాధించండి.