అప్పుడొకసారి 251 రూపాయలకే స్మార్ట్ ఫోన్ అంటూ ఫ్రీడం251 సంస్థ చేసిన హంగామా అంత ఇంత కాదు. అసలు ఆ ఫోన్ లు ఎంత మంది బుక్ చేసుకున్నారో? ఎంత మందికి ఆ ఫోన్ లు అందాయో ఎవరికి తెలియదు కానీ ఆ ఆఫర్ దేశం మొత్తాన్ని ఒక ఊపు ఊపింది. బుకింగ్ లు అయిన కాకున్నా రింగింగ్బెల్స్ కంపనీ కి మస్తు పబ్లిసిటీ వచ్చింది. జనాలు ఆ సంఘటన మార్చిపోక ముందే ఇప్పుడు బెంగళూరు కి చెందిన నమోటెల్ అనే సంస్థ 99 రూపాయలకే స్మార్ట్ ఫోన్ ఇస్తామంటూ ముందుకు వచ్చింది.
నిన్న జరిగిన మీడియా సమావేశంలో ఆ సంస్థ ప్రతినిది మాధవరెడ్డి మాట్లాడుతూ నమోటెల్ అచ్చేదిన్ అనే పేరిట 99 రూపాయలకె ఆండ్రాయ్డ్ స్మార్ట్ ఫోన్ ఇస్తామని ఆ ఫోన్ ఫోటోలు కూడా చూపించారు. దానితో పాటు ఫోన్లో గురించి ఒక వీడియో కూడా రిలీజ్ కూడా చేశారు. ఆ వీడియో లో ఫోన్ ఎలా బుక్ చేయాలో కూడా చెప్పారు.
అతను చెప్పిన ప్రకారం ముందు అనే వెబ్సైట్ లో రిజిస్టర్ అవ్వాలి. రిజిస్టర్ అయిన తర్వాత మీకు ఒక రెఫరెన్స్ ఐడి వస్తుంది. దాని తర్వాత అనే వెబ్సైట్కి వెళ్ళి పైన వచ్చిన రెఫరెన్స్ ఐడి తో లాగిన్ అయి ఫోన్ ని బుక్ చేసుకోవచ్చు. క్యాష్ ఆన్ డెలివరీ ఆప్షన్ కూడా ఉంది అని మాధవరెడ్డి తెలిపారు. ఐతే ఇంత తక్కువకు మొబైల్ ఎలా అందించగలుగుతారు అన్న ప్రశ్నకు మాత్రం ఆయన సమాధానం చెప్పలేదు. ఇంతకీ ఈ సంస్థ అయిన చెప్పినట్లు 99 రూపాయలకు స్మార్ట్ ఫోన్ ఇస్తారో లేక ఫ్రీడం251 ఫోన్ లాగా కేవలం పబ్లిసిటీ కోసం చేసారో తొందరలో తెలుస్తుంది.
Must Read: స్మార్ట్ ఫోన్ ఉంటే చాలు.! డ్రైవింగ్ లైసెన్స్, బండి పేపర్లు అవసరం లేదు.