Home / Entertainment / క్యాబ్‌ రైడ్‌ను రద్దు చేస్తే రూ.25వేల వరకు జరిమానా?

క్యాబ్‌ రైడ్‌ను రద్దు చేస్తే రూ.25వేల వరకు జరిమానా?

Author:

గత కొన్నేళ్లుగా ఓలా, ఉబెర్‌ వంటి సంస్థలు ప్రజలకు క్యాబ్‌ సేవలను అందిస్తున్నాయి. మనం ఏదైనా ప్రాంతానికి వెళ్లేందుకు క్యాబ్‌ బుక్‌ చేసుకున్న తర్వాత కొంతమంది డ్రైవర్లు ఆ ప్రదేశానికి రాలేమంటూ రైడ్‌ను రద్దు చేసుకుంటారు. ఇక చేసేదేమి లేక ప్రయాణికులు వేరే క్యాబ్‌ను బుక్‌ చేసుకుంటుంటారు.

ఇక మీదట అలా ఎవరైన డ్రైవర్‌ రైడ్‌ను రద్దు చేస్తే రూ.25వేల వరకు జరిమానా ఎదుర్కొవాల్సి ఉంటుంది. దీనికి సంబంధించిన ఓ ప్రతిపాదనను దిల్లీ ప్రభుత్వం త్వరలోనే తీసుకురానుంది.క్యాబ్‌ సేవల ధరలు పెరుగుదలను నియంత్రించడంతో పాటు, వాటిల్లో ప్రయాణించే ప్రయాణికుల భద్రతకు సంబంధించిన నిబంధనలను మరింత కఠినతరం చేయాల్సిందిగా కోరుతూ దిల్లీ రోడ్డు రవాణా శాఖ సరికొత్త డ్రాఫ్ట్‌ను రూపొందించింది. క్యాబ్‌ డ్రైవర్లు ప్రయాణికుల పట్ల అసభ్యకరంగా ప్రవర్తిస్తే వారిపై పోలీస్‌ కేసు పెట్టాలని ఆ డ్రాఫ్ట్‌లో పేర్కొన్నారు.

Cab driver cancelled at last min Rs 25,000 fine

ఒకవేళ కేసు పెట్టకుండా ఉన్నట్లయితే సదరు డ్రైవర్ లక్ష రూపాయలు జరిమానా చెల్లించాల్సి ఉంటుంది. దీనికి సంబంధించిన ముసాయిదాను దిల్లీ పీడబ్ల్యూడీ మంత్రి సత్యేంద్ర జైన్‌ త్వరలోనే కేబినెట్‌ ముందు పెట్టనున్నారు. ఇందుకు దిల్లీ ప్రభుత్వం ఆమోదం తెలిపితే.. క్యాబ్‌ డ్రైవర్లకు ఈ కొత్త నిబంధనలు అమల్లోకి రానున్నాయి.

ప్రయాణికుల భద్రత రీత్యా క్యాబ్‌ సేవలు అందించే వాళ్లు తప్పకుండా 24గంటల పాటు అందుబాటులో ఉండే విధంగా కాల్‌ సెంటర్‌ను ఏర్పాటు చేయాలి. వీటి జీపీఎస్‌ సిస్టమ్‌ను రవాణా శాఖ కేంద్రం నిరంతరం పర్యవేక్షిస్తుంటుంది. క్యాబ్‌ సేవలు అందించే సంస్థలు ప్రయాణికుల దగ్గర నుంచి కనిష్ఠంగా, గరిష్ఠంగా వసూలు చేయాల్సిన కనీస ఛార్జీలను రవాణా శాఖ నిర్ణయించే విధంగా త్వరలోనే చట్టాన్ని తీసుకురానున్నారు.

(Visited 1 times, 1 visits today)