మనలో చాలామంది ఒకప్పుడు క్యాన్సర్ గురించి వినడం తప్ప దాని ద్వారా మనకు తెలిసిన వారు బాదపడడమో, చనిపోవాడమో చూడలేదు. కానీ అదిప్పుడు క్రమ క్రమంగా మారుతుంది. ఈ రోజుల్లో మనకు తెలిసిన వారు ఎవరో ఒకరు ఈ ప్రాణాంతక వ్యాదితో బాదపడుతూనే ఉన్నారు. భారతీయ ఆరోగ్య శాఖ వెల్లడించిన వివరాలు కూడా అలాగే ఉన్నాయి. ఇంతకుముందు ఎన్నడు లేని విధంగా 5 లక్షలకు పైగా భారతీయులు 2015లో క్యాన్సర్ కారణముగా మరణించగా, మరో 11 లక్షలకు పైగా మంది వివిద రకాల క్యాన్సర్ వ్యాదితో బాదపడుతూ చికిత్స పోందుతున్నారు.
ఇంత మంది చనిపోవడానికి క్యాన్సర్ రోగం మాత్రమే కారణం కాదు, ప్రజలలో ఉన్న నిర్లక్ష ధోరణి, ఆ వ్యాధిపై అవగాహన లేకపోవడం కూడా మరణాల సంఖ్య పెరగడానికి కారణం. 80% మంది క్యాన్సర్ బాదితులు ఆ జబ్బు క్రిటికల్ స్టేజ్ వచ్చేవరకు డాక్టర్ ని సంప్రదించక పోవడంతోనే మరణిస్తున్నారు అని ఒక నివేదిక వెల్లడించింది. అంతేకాకుండా మొత్తం నమోదు అవుతున్న క్యాన్సర్ కేసులలో 55% పైగా మహిళలే ఎక్కువగా మగవారి కన్నా ఈ జబ్బు భారిన పడుతున్నారు. మారుతున్న జీవన విదానం, ఆహారపు అలవాట్లు, అలసత్వం, వాతావరణ కాలుష్యం ఇంకా చాలా విషయాలు మన దేశంలో ఈ క్యాన్సర్ వ్యాది విజృంభించడానికి కొన్ని కారణాలు.
ప్రపంచ వ్యాప్తంగా ఎన్నో లక్షల మంది ఈ క్యాన్సర్ మహమ్మారీ భారిన పడిమరణిస్తున్నారు. సరైన సమయంలో వ్యాధి లక్షణాలను గుర్తించి చికిత్స చేయించుకుంటే 100% ఈ వ్యాది నుండి బయటపడవచ్చని డాక్టర్ లు వెల్లడిస్తున్నారు. దయచేసి క్యాన్సర్ ని తక్కువ అంచనా వేయకుండా ఆ లక్షణాలు కనపడితే వెంటనే డాక్టర్ ని సంప్రదించండి.
కాన్సర్ వ్యాధి ఉన్నవారిలో కనిపించే సాధారణమైన లక్షణాలు:
ఈ లక్షణాలలో ఏ ఒక్క లక్షణం అయిన కాన్సర్ కి కారణం కావొచ్చు, కాన్సర్ ని ప్రాథమిక దశలోనే గుర్తించి సరైన చికిత్స చేయించుకోండి.