Home / Political / Video: సెల్ ఫోన్ సిగ్నల్ కోసం చెట్టెక్కిన కేంద్ర మంత్రి.

Video: సెల్ ఫోన్ సిగ్నల్ కోసం చెట్టెక్కిన కేంద్ర మంత్రి.

Author:

గ్రామాల్లో ప్రజలు ఎలాంటి సమస్యలు ఎదుర్కుంటున్నారో కేంద్ర ఆర్థిక శాఖ సహాయ మంత్రి గారికి ప్రత్యక్షంగా అనుభవిస్తే కాని అర్ధం కాలేదు. కేంద్ర ఆర్థిక శాఖ సహాయ మంత్రి అర్జున్ రామ్ మేఘ్వాల్ గారు తన నియోజకవర్గం అయిన రాజస్థాన్ లోని బికనీర్ కి వెళ్ళారు. అక్కడ ఢోలియా అనే గ్రామంలో ఆసుపత్రిలో నర్సులు తగినంతగా లేరని స్థానికులు ఫిర్యాదు చేసారు. ఇవే కాకుండా మరి కొన్ని సమస్యలు ఉండటంతో వాటి పరిష్కారం కోసం ఆయన ఢోలియాకు వెళ్లారు. ప్రజల సమస్యలకు వెంటనే స్పందించిన మంత్రి ఈ విషయం ఉన్నతాధికారులతో మాట్లాడి పరిష్కరిస్తానని జేబులో నుండి ఫోన్ బయటకి తీసాడు, చూస్తే మంత్రి గారి ఫోన్ లో సిగ్నల్ లేదు. అప్పుడు ప్రజలు ఎప్పటినుండో తాము ఫోన్ సిగ్నల్ లేక అవస్తలు పడుతున్నామని ఆ సమస్యను కూడా పరిష్కరించమని కోరారు.

అయితే కొందరు గ్రామస్తులు వారి ఊరిలో గల పెద్ద చెట్టు ఎక్కితే సిగ్నల్ వస్తుందని అప్పుడు మంత్రి గారు ఫోన్ మాట్లడవచ్చని తెలిపారు. చెప్పిందే తడవుగా చెట్టు ఎక్కడానికి రెడీ అయ్యారు మంత్రి గారు. వెంటనే మంత్రి గారు చెట్టు ఎక్కడానికి ఒక నిచ్చెన ఏర్పాటు చేసారు. దాని సహాయం చెట్టు ఎక్కిన మంత్రి గారు సంభందిత అధికారులకు ఫోన్ చేసి ఆ ఊరి సమస్యలు పరిష్కరించ వలసిందిగా ఆదేశించారు. అంతే కాకుండా ఆ ఊరికి త్వరలోనే ఒక సిగ్నల్ టవర్ ఏర్పాటు చేయిస్తానని ప్రకటించారు.

(Visited 139 times, 1 visits today)