తెలంగాణ రాష్ట్ర ఇంటర్మీడియట్ ఫస్ట్, సెకండ్ ఇయర్ ఫలితాలని ఇంటర్ బోర్డు కార్యాలయంలో తెలంగాణ రాష్ట్ర విద్యాశాఖ మంత్రి కడియం శ్రీహరి విడుదల చేసారు, ముందుగా ఈ నెల 17 న ఫలితాలని విడుదల చేయాలనీ అనుకున్న ఒకరోజు ముందుగానే ఫలితాలని విడుదల చేయడానికి ఇంటర్ బోర్డు అధికారులు నిర్ణయించారు, తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా దాదాపు 9 .76 లక్షల మంది విద్యార్థులు పరీక్షలకి హాజరయ్యారు, కొత్తగా ఏర్పాటైన జిల్లాల ప్రకారమే ఫలితాలని విడుదల చేస్తున్నట్లు అధికారులు ప్రకటించారు.
ఇంటర్ ప్రథమ సంవత్సరంలో 57% మంది పాస్ అయ్యారు, ద్వితీయ సంవత్సరంలో 66.45% మంది పాస్ అయ్యారు, ఇంటర్ ప్రథమ, ద్వితీయ సంవత్సర ఫలితాలని వివిధ వెబ్ సైట్ లలో ఉంచారు, విద్యార్థులు తమ హాల్ టికెట్ నెంబర్ ద్వారా ఫలితాలు తెలుసుకోవచ్చు, ఇంటర్ బోర్డు అధికారిక వెబ్ సైట్ అయిన results.cgg.gov.in ద్వారా విద్యార్థులు, కాలేజీ ప్రిన్సిపాళ్లు ఫలితాలని తెలుసుకోవచ్చు.