కల్తీకి కానిదేది అనర్హం అన్నట్టుగా తయారైంది పరిస్థితి, మనకి ప్రతిరోజూ అవసరం ఉండే వస్తువులని కల్తీ చేస్తూ మన ఆరోగ్యాలతో ఆడుకుంటున్నారు, తాజాగా కోల్ కతాలో ఒక ముఠా చేస్తున్న మోసం బయట పడింది, ప్లాస్టిక్ కోడిగుడ్లను యథేచ్చగా అమ్మేస్తున్నారు వ్యాపారులు. కరేయా పోలీస్ స్టేషన్ సమీపంలో ఉండే మహిళ ఇచ్చిన ఫిర్యాదుతో అలర్ట్ అయిన పోలీసులు.. వ్యాపారిని అదుపులోకి తీసుకున్నారు. దుకాణంలో పెద్ద ఎత్తున నిల్వ చేసిన ప్లాస్టిక్ కోడిగుడ్లను స్వాధీనం చేసుకున్నారు.
ఇంట్లో కోడిగుడ్లని ఉడకబెడుతుండగా అవి ఒక రకమైన వాసన రావటంతో అనుమానించి , వాటిని పరీక్షించి ప్లాస్టిక్ కోడిగుడ్లని నిర్దారింఛి కన్ స్యూమర్ కోర్టులో ఫిర్యాదు చేసింది, ఫిర్యాదు అందుకున్న వెంటనే అధికారులు ఆ ప్రాంతంలోని దుకాణాల్లో దాడులు చేసి ప్లాస్టిక్ కోడిగుడ్లని విక్రయిస్తున్న వ్యాపారిని అదుపులోకి తీసుకున్నారు, ఆ దుకాణంలో ఎక్కువమొత్తంలో నిల్వ ఉంచిన ప్లాస్టిక్ కోడిగుడ్లని స్వాధీనం చేసుకున్నారు, ఈ ప్లాస్టిక్ కోడిగుడ్లు చైనా నుండి వచ్చాయి అని ప్రాథమిక విచారణలో తేలిందని, ఇంకా మరింత సమాచారం కోసం అన్ని కోణాలలో విచారణ చేస్తున్నారు, ఈ ప్లాస్టిక్ కోడిగుడ్లు వేరే రాష్ట్రాలకి కూడా చేరాయని ప్రజలు అప్రమత్తంగా ఉండాలని అధికారులు తెలిపారు.