Home / Inspiring Stories / మేయర్ ని పాయంట్ బ్లాంక్ లో కాల్చి చంపారు.

మేయర్ ని పాయంట్ బ్లాంక్ లో కాల్చి చంపారు.

Author:

chittor 1

మంగళవారం పొద్దున చిత్తూరు మేయర్ అనూరాధ ను నలుగురు వ్యక్తులు అతి దారుణంగా హత్య చేశారు. మేయర్ ఆఫీస్ లో ప్రజల నుండి విజ్ఞాపన పత్రాలు స్వీకరిస్తున్నప్పుడు నల్ల బురఖాలు దరించిన నలుగురు ఆగంతకులు అనూరాధ ని కలవాలని చెప్పి ఆమె ఆఫీస్ లోకి వెళ్లారు. ఆ సమయంలో అనూరాధతో పాటు ఉన్న ఆమె భర్త మోహన్ పై కూడా ఆగంతకులు అతి సమీపం నుండి కాల్పులు జరిపారు. ఈ దాడిలో అనూరాధ ప్రాణాలు విడువగ, ఆమె భర్త మోహన్ ను తమిళనాడులోని వేలూరు ఆస్పత్రి కి తరలించారు.

ఈ ఘటన జరిగుతున్నప్పుడు ఎవరు వచ్చి ఆపే ప్రయత్నం చేయలేదు, అందరు తలో దిక్కు పారిపోయి ప్రాణాలు దక్కించుకున్నారు. మేయర్ చనిపోయిందని నిరూపించుకున్నాక ఆగంతకులు గోడ దూకి పారిపోయారు. కొంత సమయం తర్వాత ఇద్దరు వ్యక్తులు చిత్తూరు వన్ టౌన్ పోలీస్ స్టేషన్ లో తామే ఈ హత్య చేశామంటూ లొంగిపోయారు. దీనిపై పోలీసులు ఇంకా ఎటువంటి వివరాలు తెలుపలేదు. కానీ నగరం నడిబొడ్డున మేయర్ ని కాల్చి చంపడం సమాజం లో పెరుగుతున్న ఆరాచకత్వానికి ఒక ఉదాహరణ.

(Visited 50 times, 1 visits today)