రియోలో జరుగుతున్న పారాలింపిక్స్లో మనదేశ ఖాతాలో రెండొ స్వర్ణం చేరింది, జావెలిన్ త్రోలో భారత్ కి చెందిన దేవేంద్ర ఝఝారియా జావెలిన్ను 63.97 మీటర్లు విసిరి సరికొత్త రికార్డు నెలకొల్పడంతో పాటు బంగారు పతకాన్ని కూడా సాధించాడు. ఈ పతకంతో మనదేశ పతకాల సంఖ్య 4 గుకు చేరింది, ఇందులో రెండు స్వర్ణాలు, ఒక రజతం, ఒక కాంస్యం పతకం ఉన్నాయి. ఇప్పటివరకు జరగిన పారాలింపిక్స్లో మన దేశానికి ఇదే అత్యుత్తమ ప్రదర్శన.