శివునికి అభిషేకం అంటే ఎంతో ఇష్టమని పురోహితులు చెబుతున్నారు.శివుడు అభిషేక ప్రియుడు. శివుడికి కాసిన్ని నీరు పోసిన, సంతోషంతో పొంగిపోతాడు.అభిషేకించడం వలన సదాశివుని అనుగ్రహంతో జీవితానికి పట్టిన పీడ తొలగిపోతుంది. మహాశివుడిని ఈ అభిషేకాలతో సంతృప్తి పరచడంవలన అనేక దోషాలు నశించి ఆయురారోగ్యాలు … ధనధాన్యాలు ప్రాప్తిస్తాయి. ఆ కుటుంబాలు తరతరాలపాటు సకల శుభాలతో అలరారుతుంటాయి.
మనం చాలా సందర్భాలలో శివుడికి అభిషేకం చేస్తుంటాం. మరి మీరు ఏవిధంగా చేస్తున్నారో మీకు తెలుసా? మీరు ఏవిధంగా చేస్తే మీకు ఏ పుణ్యం ఉంటుందో ఒక్కసారి తెలుసుకొండి.
- ఆవు పాల అభిషేకం చేస్తే సర్వ సౌఖ్యములు లభించును
- ఆవు నెయ్యితో అభిషేకం చేస్తే ధన ప్రాప్తి కలుగును
- మారేడు బిల్వదళ జలముతో చేత అభిషేకం చేసిన భోగభాగ్యాలు లభించును
- గరిక నీటితో శివాభిషేకం చేసిన నష్టపోయిన ధనం తిరిగి పొందగలరు.
- నువ్వుల నూనెతో అభిషేకం చేసినా అపమృత్యువు నశించగలదు.
- పెరుగుతో అభిషేకించిన ఆరోగ్యము పొందవచ్చు.
- చెక్కరతో అభిషేకించిన దుఃఖ నాశనం కలుగును
- పుష్పోదకము చేత అభిషేకించిన భూలాభం కలుగును
- రుద్రాక్ష జలాభిషేకం చేసినచో సకల ఐశ్వర్యములను పొందవచ్చు.
- కస్తూరి కలిపినా నీటిచే అభిషేకం చేసిన కీర్తి పెరుగును
- పసుపు నీటితో అభిషేకం జరిపితే మంగళ ప్రదము జరుగును, శుభకార్యాలు తొందరగా జరుగును.
(Visited 6,436 times, 1 visits today)