తన నైపుణ్యంతో ఎన్నో రికార్డులని సృష్టించిన విరాట్ కోహ్లీ బంగ్లాదేశ్ తో హైదరాబాద్ లో జరుగుతున్న ఏకైక టెస్ట్ మ్యాచులో మరో అరుదైన రికార్డుని సృష్టించాడు, గతేడాది టెస్టుల్లో మూడు ద్విశతకాలు సాధించిన కోహ్లి ఈ ఏడాది మరో ద్విశతకంతో టెస్టులను ఘనంగా ఆరంభించాడు. గత సంవత్సరం మూడు టెస్టు సిరీస్ల్లో (వెస్టిండీస్పై 200, న్యూజిలాండ్పై 211, ఇంగ్లండ్పై 235) ద్విశతకాలు సాధించిన కోహ్లి.. ప్రస్తుతం బంగ్లాదేశ్తో జరుగుతున్న ఏకైక టెస్ట్లోనూ ద్విశతకం(204) బాదాడు. తద్వారా వరుసగా నాలుగు టెస్ట్ సిరీస్ల్లో ద్విశతకాలు సాధించిన తొలి బ్యాట్స్మన్గా రికార్డులకెక్కాడు.గతంలో బ్రాడ్మన్, ద్రవిడ్ మూడు వరుస సిరీస్ల్లో ద్విశతకాలు సాధించారు. బంగ్లాపై ద్విశతకంతో వారి రికార్డును చెరిపేసిన కోహ్లి.. సరికొత్త రికార్డుతో దిగ్గజ ఆటగాళ్లను దాటేశాడు.
తన ఆటతీరుతో ప్రపంచంలోనే గొప్ప బ్యాట్స్ మెన్ గా నిలిచినా కోహ్లీ గత రెండు సంవత్సరాల నుండి అద్భుతమైన ఆటతీరుతో ఎన్నో మ్యాచ్ లలో భారత జట్టుని గెలిపించాడు, సచిన్ తరువాత అంతటి స్థాయిని అందుకోగల క్రికెటర్ గా కోహ్లీని అందరు గుర్తిస్తున్నారు,కోహ్లీ తన ప్రత్యేకమైన ఆటతీరుతో ప్రపంచవ్యాప్తంగా అభిమానులని చేసుకున్నాడు, కోహ్లీ ఇంకా ఎన్నో రికార్డులని చెరిపేసి, కొత్త కొత్త రికార్డులని సృష్టించాలని క్రికెట్ అభిమానులు కోరుకుంటున్నారు.