వెంకటేశ్వర స్వామి వారి భక్తులకు ఉపయోగపడేలా తిరుమల తిరుపతి దేవస్థానం శుభవార్త వినిపించింది. టిటిడి ఆధ్వర్యంలో ఇప్పటి వరకూ అందిస్తున్న ఉచిత భోజన సదుపాయంతో పాటు అల్పాహారాన్ని కూడా ఇచ్చేందుకు ఏర్పాట్లు చేసింది.శ్రీవారి ఆలయానికి దగ్గరలో ఉన్న వెంగమాంబ నిత్య అన్నప్రసాద సముదాయంలో భక్తులకు అల్పాహారాన్ని అందించే పథకానికి టీటీడీ ఈవో సాంబశివరావు శ్రీకారం చుట్టారు. భక్తులకు టిపిన్ను పెట్టి ఈ పథకాన్ని లాంఛనంగా ప్రారంభించారు. ప్రతీరోజూ ఉదయం పూట రెండు గంటల పాటు ఈ అల్పాహారాన్ని వడ్డిస్తారు. ఒకేసారి నాలుగు వేల మంది భక్తులకు అల్పాహారం అందించగల సామర్ధ్యం ఉందని ఈవో తెలిపారు. తిరుమల శ్రీవారి ఆలయంలో అన్నప్రసాదం ట్రస్టు కింద మొత్తం 700 కోట్ల రూపాయలకు పైగా డిపాజిట్లు ఉన్నందుకు భక్తులకు ఉపయోగపడే మరిన్ని సౌకర్యాలపై దృష్టిపెట్టినట్లు సాంబశివరావు వెల్లడించారు. ఉదయాన్నే శ్రీవారిని దర్శనం చేసుకునే భక్తులకు ఉచిత అల్పాహార సదుపాయం చాలా ఉపయోగకరంగా ఉంటుంది.
Must Share: తిరుపతిలో ఖచ్చితంగా దర్శించవలసిన ప్రదేశాలు.