దేశాన్ని డిజిటల్ ఇండియా గా మార్చడానికి అన్ని రంగాలు ముందుకు వస్తున్నాయి. క్యాష్లెస్ ట్రాన్సాక్షన్స్ను ప్రోత్సహించే క్రమంలో ఇకనుండి ఆన్లైన్ లో గ్యాస్ సిలిండర్ బుక్ చేస్తే రూ.5 డిస్కౌంట్ ఇవాలని ప్రధాన చమురు సంస్థలు నిర్ణయించాయి. వాటిలో మొదటగా భారత్ ప్రెట్రోలియం కార్పోరేషన్ లిమిటెడ్ వారు తమ కస్టమర్లకు ఇదే విషయాన్ని మెసేజ్ ల రూపంలో పంపింది. ఇప్పుడు అన్ని గ్యాస్ ఏజెన్సీస్ ఈ సదుపాయాన్ని కల్పిస్తున్నాయి, ఇలా ఆన్లైన్ లో గ్యాస్ సిలిండర్ బుక్ చేస్తే 5 రూపాయల డిస్కౌంట్ తో పాటు చాలా ఉపయోగాలు ఉన్నాయి. చిల్లర కోసం అలోచించాల్సిన అవసరం లేదు మరియు డెలివరీ బాయ్స్ సిలిండర్ డెలివరీ చేస్తే అదనంగా రూ.20 నుంచి రూ.30 ఇవ్వాల్సిన అవసరం లేదు.
ప్రభుత్వ నిభందనల ప్రకారం ప్రతి గ్యాసు డీలరు తమ కస్టమర్లకు స్వైపింగ్ మెషీన్లు అందుబాటులో ఉంచాలి, కాని చాలా గ్యాస్ ఏజెన్సీలు నగదు రహిత లావాదేవీలకు దూరంగా ఉండి కస్టమర్ల దగ్గర చిల్లర లేదని, డెలివరీ చార్జీల రూపంలో ఎక్కువ వసూలు చేస్తున్నాయి. ఆన్లైన్ పేమెంట్ తో ఈ కష్టాలన్ని తీరడమే కాకుండా 5 రూపాయల డిస్కౌంట్ కూడా లభించనుంది. ఇక నుండి అయినా ప్రజలు ఈ సదుపాయాన్ని ఉపయోగించుకొని దేశాన్ని డిజిటల్ ఇండియాగా మార్చాలని కోరుకుందాం.