హైదరాబాద్ మహానగర అభివృద్ది సంస్థ “ల్యాండ్ రెగ్యులరైజేషన్ స్కీం” దరఖాస్తుల పరిష్కార ప్రక్రియను సాధ్యమైనంత వేగంగా పూర్తి చేయడానికి నడుం బిగించింది. తదనుగుణంగా ఈ రెండు రోజులు అనగా ఫిబ్రవరి 26, 28 తేదీలలో LRS మేళాను స్థానిక జోనల్ ఆఫీసులలో నిర్వహించి దరఖాస్తు ప్రక్రియలను పూర్తి చేయాలని నిశ్చయించారు.
గతంలో ప్రభుత్వం తీసుకున్న పర్మిషన్లు లేని లే-అవుట్లలో కొనుగోలు చేసిన ప్లాట్లను LRS ద్వార క్రమబద్దీకరణ చేసుకునే అవకాశానికి ప్రజల నుండి మంచి స్పందన వచ్చింది. తద్వార నగరపాలక సంస్థకు 1.7 లక్షల దరఖాస్తులు వచ్చాయి. LRS క్రమబద్దీకరణ ఈ నెల 28 లోగా పూర్తి చేయాలని ప్రభుత్వం నిర్ణయం తీసుకోవడంతో ఈ స్పెషల్ మేళాను దరఖాస్తుదారులు సద్వినియొగపరుచుకోవాలని కమీషనర్ కోరారు.
తెలుగు డాట్ అలజడి డాట్ కామ్ ను ఫేస్బుక్, ఇన్స్టాగ్రామ్,ట్విటర్లో ఫాలో అవ్వండి. యూట్యూబ్లో సబ్స్క్రైబ్ చేయండి.