Home / General / భార్య రోజు కొడుతూ తిడుతూ..చిత్రహింసలు పెడుతుందని గృహ హింస కేసు పెట్టిన భర్త.

భార్య రోజు కొడుతూ తిడుతూ..చిత్రహింసలు పెడుతుందని గృహ హింస కేసు పెట్టిన భర్త.

Author:

భర్త రోజు కొడుతూ హింసిస్తున్నాడని తన బారి నుండి రక్షించాలని భార్య కోర్టుని ఆశ్రయించడం లాంటి సంఘటనలు అనేకం జరిగాయి, కానీ భార్య రోజూ చిత్రహింసలు పెడుతూ చీటికీమాటికీ తిడుతూ ఇంకా భర్తే కొడుతున్నాడని ఎదురు కేసు పెట్టడంతో తన బాధ ఎవరికి చెప్పుకోవాలో అర్థం కానీ భర్త.. ఏకంగా కోర్టు మెట్లు ఎక్కాడు. భార్య నుంచి రక్షణ కోరుతూనే.. గృహ హింస చట్టం కింద చర్యలు తీసుకుని న్యాయం చేయాలని కోరాడు. ఆ భార్య బాధిత భర్త వాదనను విన్న కోర్టు విచారణకు స్వీకరించింది. కేసు వివరాల్లోకి వెళితే..

ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర రాజధాని విజయవాడలో రామ్ కుమార్ అనే వ్యక్తి ఉన్నాడు. 2017 ఆగస్ట్ నెలలో నాగజ్యోతి అనే అమ్మాయిని పెళ్లిచేసుకున్నాడు. పెళ్లయిన రెండు నెలలకే వాళ్ళ మధ్యలో గొడవలు ప్రారంభం అయ్యాయి. నాగజ్యోతికి ఇంతకుముందే పెళ్లయి పిల్లలున్న సంగతి దాచిపెట్టి మళ్ళీ తనను పెళ్లిచేసున్నదని… ఈ విషయాన్ని ఎందుకు దాచిపెట్టావ్ అని ప్రశ్నించినందుకు రోజూ కొడుతూ తిడుతూ చిత్రహింసలు పెడుతుంది. విడాకుల విషయం దాచిపెట్టి మరీ నన్ను పెళ్లి చేసుకున్నది. ఎందుకు మోసం చేశావని అడిగినందుకు నాపైనే కేసు పెట్టింది. రూ.10లక్షలు ఇవ్వాలని డిమాండ్ చేస్తోంది అని పిటీషనర్ రాంకుమార్ తెలిపాడు.

Domestic-Violence-Case-Against-Wife-In-Vijayawada

>నేను ఓ సాధారణ మెకానిక్ ని. అంత డబ్బు ఇచ్చుకోలేక కోర్టును ఆశ్రయించినట్లు తెలిపాడు. పిటీషనర్ వాదనను విన్న కోర్టు విచారణకు స్వీకరించింది. తదుపరి విచారణ ఫిబ్రవరి 21వ తేదీకి వాయిదా వేసింది కోర్టు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోనే భార్యపై 498(ఎ) చట్టం కింద కోర్టుకెక్కిన మొదటి కేసు ఇది. గృహ హింస చట్టం కింద భార్యపై కేసు నమోదు కావడంతో ఈ విషయం వైరల్ గా మారింది.

(Visited 1,595 times, 1 visits today)