హోళీ అంటేనే చాలు చిన్న పెద్ద అందరూ ఒకరిపై ఒకరు రంగులు చల్లుకుంటూ ఏంటో ఆనందంగా జరుపుకుంటారు. కొంతకాలం క్రితం వరకు ఎటువంటి రసాయనాలు కలపని సహజసిద్దంగా తాయారుచేసే రంగులనే వాడేవాళ్ళు. కాని ఇపుడు అంతా రసాయనాలు కలిపినా రంగులని వాడటం వల్ల, హోళీ జరుపుకోవడమే భయంగా మారిన పరిస్తితి. ఆ రంగులు పొరపాటున మన కళ్ళల్లోకి పడితే సాశ్వతంగా చూపుకోల్పోయే అవకాశాలు ఎక్కువ.
ఆచార్య ఎం జి రంగా యూనివర్సిటీ వారు సహజసిద్ధంగా రంగులను తాయారు చేసి వాటిని ఉచితంగా ప్రజలు పంపిణీ చేస్తామని పత్రికాముఖంగా తెలియచేసారు. వాటిని వాడటం వల్ల కొంత ఉపసమనమున్నా అవి ఎంతమదికి దొరుకుతాయో తెలియని పరిస్తితి. మనకి మార్కెట్లో దొరికే రంగులు సహజంగా తాయారు చేసినవే అని చెప్పి నకిలీ రంగులని అమ్ముతున్నారు. ఇలాంటివాటిని మనం గుర్తిచడం చాలా కష్టం. కానీ కొన్ని జాగ్రర్తలు తీసుకోవడం ద్వారా మనం ఈ హోళీ పండగని సరదాగా సెలబ్రేట్ చేస్కోవచ్చు. అవేంటో ఇప్పుడు చూద్దాం.