Home / General / 2050 నాటికి మనిషి చిరంజీవిగా బ్రతకడం సాధ్యమే!

2050 నాటికి మనిషి చిరంజీవిగా బ్రతకడం సాధ్యమే!

Author:

భవిష్యత్తులో వృద్దాప్యం అనేది కూడా ఎవరికి తెలియకుండా పోతుంది. నవ యవ్వనంతో ఉండగలిగేలా శరీర కణాలను, అవయవాలను సృష్టిస్తున్నామని అన్నారు. దుబాయ్‌లో జరిగిన వరల్డ్‌ గవర్నమెంట్‌ సమ్మిట్‌లో హిబ (HIBA హైబ్రిడ్‌ ఇంటిలిజెన్స్‌ బయోమెట్రిక్‌ అవతార్‌)ను ప్రదర్శించారు. అనేక పరిశోధనల అనంతరం దీన్ని సృష్టించారు.

మానవ మేధస్సు, కాన్షియస్‌నెస్‌ ద్వారా మనుషులు కలుస్తారనే దానికి నిదర్శనమే హిబ. అప్పుడే తనకు మరణమంటూ లేని మనిషిని తయారు చేయాలనే ఐడియా వచ్చిందని పియర్సన్‌ తెలిపారు.మనిషిని చిరకాలంగా ఉండేలా చేసేందుకు మూడు పద్దతులున్నాయని తెలిపారు. మానవ శరీరాన్ని కృత్రిమంగా తయారు చేయడం ఒకటి. ల్యాబ్‌లో శరీరఅవయవాలను, కణాలను తయారు చేసి అమర్చడం. రోబోలను తయారు చేసి వాటికి చనిపోయిన మానవుని మేధస్సును జోడించడం ఇంకో పద్దతి.

Humans will achieve IMMORTALITY in 2050

ఊహా జనిత ప్రపంచాన్ని సృష్టించి అందులో మానవ మేధస్సును, వారి జ్ఞాపకాలను భద్రపరచి కంప్యూటర్‌ ద్వారా మనిషిని బతికేలా చేయడం. ఇలా వారి మేధస్సును, జ్ఞాపకాలను భద్రపరిచే చిప్‌ను స్టేక్‌(stack), దీన్ని మరో శరీరంలోకి ప్రవేశపెట్టడం స్కిన్‌(skin) అంటారు. తద్వారా మనిషి చనిపోయినా… మళ్లీ తన జీవితం తనకే ఉంటుంది.

(Visited 1 times, 1 visits today)