అతని పేరు అలోక్ సాగర్. ఢిల్లీ లో ఐ.ఐ.టి. కాలేజీలో ఇంజనీరింగ్ చేసాడు. అనంతరం హూస్టన్ యూనివర్సిటీలో తన పి. హెచ్. డి ని పూర్తి చేసాడు. ఇటువంటి వ్యక్తి కావాలనుకుంటే ఎన్నో గొప్ప కంపెనీలు ఉద్యోగం ఇవ్వటానికి సిద్దంగా ఉంటాయి. కార్లు, బంగళాలు అంటూ జీవితాన్ని దర్జాగా గడపచ్చు. కానీ అతను వీటన్నిటినీ కాదని సమాజ సేవ చేస్తున్నాడు. ఇది నిజం.
మొదట్లో అతను ఐ.ఐ.టి కాలేజీలో ప్రొఫెసర్ గా పని చేసారు. కానీ అందులో అతనికి సంతృప్తి లేదని గ్రహించారు. కనీస వసతులు, సౌకర్యాలు లేని గిరిజన తండా కు వెళ్లి అక్కడ వాళ్ళ బాగోగులు చూస్తూ కాలం గడుపుతున్నారు. అతనికి ఉన్న ఆస్తి 3 జతల బట్టలు, ఒక సైకిల్ మాత్రమే. లక్షలు తెచ్చే ఉద్యోగాలు కాదని కనీసం రోడ్లు, విద్యుత్తు లేని ప్రాంత వాసులతో జీవనం సాగిస్తున్నారంటే నివ్వెరపోవాల్సిందే.
దీనికీ కారణం లేకపోలేదు. ఆయన ప్రొఫెస్సర్ గా చేసిన రోజుల్లో, మొన్న రాజీనామా చేసిన అర్.బి.ఐ. గవర్నర్ రఘురాం రాజన్ కు కుడా విద్యను బోధించాడు. దేశం బాగుపడాలంటే గిరిజన ప్రాంతాల వారు అభివృద్ధి చెందాలని అందుకు మూల కారణమైన మధ్యప్రదేశ్ లో హోషంగాబాద్ జిల్లాలో ఉన్న అడవి లో తన ప్రజలతో జీవితం గడపాలని నిర్ణయించుకున్నాడు.
అక్కడే ఉంటూ వారికి వ్యవసాయం, విద్య ఇలా అనేక రంగాలలో శిక్షణ ఇస్తున్నాడు. వైద్యానికి పనికి వచ్చే మొక్కలు నాటి వారి ఆరోగ్యానికి మేలు చేసే సామజిక పనులలో అంకితమైయ్యాడు ఆలోక్. దీనికోసం వారి గిరిజన భాషనూ నేర్చుకున్నాడు కుడా. ఈ క్రమంలో అటవీసేఖ ఒక పోలీసు ఎంక్వయిరీ లో ఆలోఖ్ ను అతని వేషభాషలను చూసి అనుమానం వచ్చి విచారణ చేయగా, ఇతని గురించిన నిజాలు తెలిసి ఎంతో ఆస్చేర్యానికి గురైయ్యారు.