Home / Devotional / ఆషాఢ మాసంలో కొత్తగా పెళ్లి అయిన అమ్మాయిని అత్తారింటికి ఎందుకు పంపించారో తెలుసా..?

ఆషాఢ మాసంలో కొత్తగా పెళ్లి అయిన అమ్మాయిని అత్తారింటికి ఎందుకు పంపించారో తెలుసా..?

Author:

అప్పటివరకు అంగరంగ వైభవంగా జరిగిన పెళ్లిళ్లు, ఇతర శుభకార్యాలకు ప్రతిచోటా ఆషాఢ మాసంలో బ్రేక్ పడుతుంది. ఆషాఢ మాసంలో శుభకార్యాలు చేయటానికి మంచిది కాదని, ఆధ్యాత్మికంగా ఎంతో ప్రాముఖ్యత ఉందని వేదపండితులు చెబుతారు. హిందువులు అవసరమైతే తమ ఇంట్లో జరగబోయే పెళ్లిని మూడు, నాలుగు నెలలు వాయిదా అయినా, వేస్తారు కానీ.. ఆషాఢ మాసంలో మాత్రం వివాహం చెయ్య‌రు. అలాగే, ఆషాఢ మాసంలో కొత్తగా పెళ్లయిన కోడలు, అత్తారింట్లో ఉండకూడదనే నమ్మకం కూడా ఉంది. అందువల్ల, కొత్తగా పెళ్లి అయిన అమ్మాయి ఆషాడ మాసంలో పూర్తిగా పుట్టింట్లోనే ఉంటుంది.

importance-of-ashada-masam-fears-and-doubts

 

  • ఆషాఢ మాసంలో శుభకార్యాలు చేసుకోవటం మంచిది కాదు. కానీ, పవిత్రమైన పూజలు, వ్రతాలు, రథ యాత్రలు, పల్లకి సేవ వంటి పెద్దపెద్ద శుభకార్యాలకు ఆషాడ మాసం చాలా శుభప్రదమైనది. అందుకే, ఈ మాసంలో ఆలయాలు అన్నిచోట్లా భక్తులతో కిటకిటలాడుతుంటాయి.
  • ఆషాఢ మాసంలో పెళ్లిళ్లు చేయకపోవడానికి అసలు కారణం తెలిస్తే అందరూ ఆశ్చర్యపోతారు. పూజలు, పండుగలు, ప్రత్యేక సేవలతో ఆలయాలన్ని కిటకిటలాడుతూ ఉంటాయి. అలాగే, వేద పండితులు తమ తమ పూజా కార్యక్రమాల్లో నిమగ్నమై ఉంటారు. దీనివల్ల వాళ్లకు పెళ్లి కార్యక్రమాలు చేయడానికి ఈ మాసంలో సమయం దొరకదు. ఈ కారణం వల్లే ఆషాఢ మాసంలో వివాహాలు నిర్వహించక పోవటానికి ఇదొక ముఖ్య కారణం.
  • ఉత్తరాయణ, దక్షిణాయణ కథల సారాంశం ప్రకారం ఆషాడ మాసంలో దేవుడు నిద్రలోకి వెళ్తాడట. దీనివల్ల పెళ్లి చేసుకున్న వధూవరులకు దేవుడి ఆశీస్సులు అందవనే నమ్మకంతో.. ఇలా ఆషాఢం మాసంలో పెళ్లిళ్లకు బ్రేక్ వేసినట్లు చెప్పుకొస్తున్నారు.
  • అలాగే, దక్షిణ భారతదేశంలో ఆషాఢ మాసంలో ఎలాంటి పంట చేతికి అందదు. పెళ్లి చేయడానికి సరిపడా డబ్బులు ఉండక, ఇలా సంప్రదాయం అనే పేరుతో ఆషాఢం మాసంలో పెళ్లి చేయకూడదు అనే నిబంధన తీసుకువచ్చారని పండితులు అంటుంటున్నారు.
  • పూర్వకాలంలో పెళ్లి చేయాలంటే అంటే ఎక్కువగా ఖాళీ ఉన్న ప్రదేశంలో పెద్దపెద్ద పరదాలు కట్టి వివాహాన్ని జరిపేవాళ్లు. ఆషాఢ మాసంలో గాలులు ఎక్కువగా వీస్తాయి కాబట్టి, గాలి తీవ్రత వల్ల పెళ్లికి ఆటంకం ఏర్పడవచ్చు. అలాగే, పెళ్లి సమయంలో నిర్వహించే విందు వంటకాలపై దుమ్ము, ధూళి పడే అవకాశం ఉంటుంది. విద్యుత్ వైర్లు తెగడం, హోమాల వల్ల ప్రమాదాలకు అవకాశాలు ఎక్కువ ఉండే ఉండటం. ఈ కారణాల చేత ఆషాఢం మాసంలో పెళ్లి కార్యక్రమాలు జరపకపోవడం మంచిదని మన పెద్దవాళ్లు ఈ నిర్ణయాన్ని తీసుకున్నారట.
  • ఇకపోతే, తెలంగాణ, ఆంధ్రప్రదేశ్, కర్ణాటకలలో ఆషాఢ మాసం వచ్చిందంటే కొత్తగా పెళ్లైన అమ్మాయి తన అత్తగారింట్లో ఉండకూడదు. అందుకే పెళ్లికూతుళ్లను ఆ మాసం అంతా పుట్టింటికి పంపిస్తారు.
  • కొత్తగా పెళ్లైన భార్యాభర్తలు ఆషాఢ మాసంలో వేరువేరుగా ఉండటానికి మరో బలమైన కారణం ఉంది. భార్యభర్తల కలయిక వల్ల గర్భం దాల్చే అవకాశం ఉంది. ఆషాఢ మాసంలో గర్భం దాల్చడం వల్ల నిండు వేసవిలో ప్రసవం జరుగుతుంది. వేసవిలో బిడ్డకు జన్మనివ్వడం వల్ల ఎండ తీవ్రతకి బిడ్డకు, తల్లికి అనారోగ్య సమస్యలు, ఇన్ఫెక్షన్స్ ఎక్కువగా వచ్చే అవకాశం ఉందని భావించిన మన పూర్వీకులు భార్యాభర్తలను ఈ నెలలో దూరంగా పెట్టే సంప్రదాయం తీసుకొచ్చారు.
  • వేసవిలో నార్మల్ డెలివరీ చాలా ఇబ్బందికరమైన విషయం. అలాగే, ప్రసవానంతరం రక్తస్రావం కూడా ఎక్కువగా జరిగే అవకాశం ఉంది. పూర్వం ఆసుపత్రుల్లో సరైన వైద్యం ఉండేది కాదు కాబట్టి, ఇలా సంప్రదాయం పేరుతో భార్యాభర్తలను కలవకుండా వేరువేరుగా ఉంచేవాళ్లట.
(Visited 3,603 times, 1 visits today)