కబడ్డీలో ఎదురులేని రారాజుగా కొనసాగుతున్న టీం ఇండియా మరోసారి విశ్వ విజేతగా నిలిచింది, కబడ్డీలో మన దేశాన్ని ఢీకొట్టే దేశం లేదని నిరూపించింది. ఈరోజు జరిగిన కబడ్డీ వరల్డ్ కప్ ఫైనల్ గెలిచింది. ఇరాన్ తో జరిగిన హోరాహోరీ మ్యాచ్ లో 38-29 ఆధిక్యతతో గెలిచింది. ఫస్ట్ ఆఫ్ లో కొంచెం తడబడ్డప్పటికీ సెకండ్ ఆఫ్ లో దిమ్మతిరిగే ఆటతో కబడ్డీ కప్ ని కైవసం చేసుకున్నారు.