ఐపీఎల్-10 సీజన్కు కోసం ఆటగాళ్ల వేలం బెంగళూరులో కొనసాగుతోంది. స్టార్ ఆటగాళ్లను దక్కించుకునేందుకు ఫ్రాంచైజీలు పోటీ పడుతున్నాయి. టీ20లో స్పెషలిస్ట్లుగా ముద్ర పడిన ఆటగాళ్లు వేలంలో ఎవరు ఊహించని ధర పలుకుతున్నారు. ఇంగ్లండ్ జాతీయ జట్టు ఆల్ రౌండర్ బెన్ స్టోక్స్ను ఈ సీజన్లో అత్యధికంగా 14.5 కోట్లు ఖర్చు చేసి పుణె దక్కించుకుంది. మన దేశీయ ఆటగాడు, గత సంవత్సరం వేలంలో 8.5 కోట్లకి అమ్ముడు పోయిన పవన్ నేగి ఈ సంవత్సరం కేవలం ఒక కోటి రూపాయలకే అమ్ముడవటం ఆశ్చర్యం కలిగించింది.
మొదటి రౌండ్ ప్రకారం వేలంలో ఎక్కువ రేటు పలికిన ఆటగాళ్ళు.
మొదటి రౌండ్లో న్యూజీలాండ్ ఆటగాడు మార్టిన్ గుప్తిల్, ఇంగ్లాండ్ ఆటగాళ్లు అలెక్స్ హేల్స్, జాసన్ రాయ్, ఇండియా ఆటగాళ్లు ఇర్ఫాన్ పఠాన్, సౌరభ్ తివారీ, , ఇషాంత్శర్మలను కొనుగోలు చేసేందుకు ఫ్రాంచైజీలు ఆసక్తి చూపలేదు.