జియో వచ్చినప్పటి నుండి మన దేశంలో సగటు ఇంటర్నెట్ వినియోగం భారీగా పెరిగిన సంగతి తెలిసిందే, అతి తక్కువ రేట్ లు లో అపరిమిత కాల్స్, మెసేజ్ లు, ఇంటర్నెట్ ఇస్తుండటంతో చిన్న చిన్న గ్రామాలలో కూడా జియో కి డిమాండ్ నెలకొంది, స్మార్ట్ ఫోన్ వాడటం రాణి వారి కోసం కేవలం రూ.1500 కే జియో ఫీచర్ ఫోన్ ని లాంచ్ చేసిన సంగతి తెలిసిందే, 4G ఫీచర్ ఫోన్ వాడేవాళ్ళ కోసం జియో మరొక బంపర్ ఆఫర్ ని తీసుకొచ్చింది.
డేటా తక్కువ వినియోగిస్తూ, కాల్స్పై అధికంగా ఆధారపడే వారికి రిలయన్స్ జియో భారీ ఆఫర్ ప్రకటించింది. తమ 4జీ ఫీచర్ఫోన్ జియోఫోన్ వినియోగదార్లు రూ.49తో రీఛార్జి చేసుకుంటే, 28 రోజుల పాటు ఏ నెట్వర్క్కు అయినా అపరిమిత కాల్స్, 1 GB డేటా లభించే పథకాన్ని అందుబాటులోకి తెచ్చింది. ఇంతకుముందు ఈ ఆఫర్ కోసం రూ.153 తో రీచార్జి చేసుకునేవారు, జనవరి 26 నుంచి ఈ ప్లాన్ అమల్లోకి వస్తుంది. ఇప్పటికే జియో ఫోన్ వినియోగిస్తున్న వారితో పాటు కొత్తగా రూ.1,500తో ఈ ఫోన్ కొనుగోలు చేసుకున్న వారికీ ఈ ఆఫర్ వర్తిస్తుంది. ఇది ఒక్క నెలకే పరిమితం కాదని, మూడేళ్ల పాటు ఈ పథకం అమలవుతుందని సంస్థ ప్రతినిధి వెల్లడించారు. అదనపు డేటా కావాలనుకుంటే రూ.11, 21, 51, 101తో రీఛార్జి చేసుకోవాలని తెలిపింది. ఇతర ఫోన్ల వినియోగదార్లు రూ.98తో రీఛార్జి చేసుకుంటే, 28 రోజులకు అపరిమిత కాల్స్, 2 జీబీ డేటా లభించే పథకం కూడా నేటినుంచే అందుబాటులోకి వస్తోంది. రోజూ 1 జీబీ, 1.5 జీబీ డేటా లభించే పథకాలకు అదనంగా రోజూ 500 ఎంబీ డేటా ఇచ్చే పథకాలనూ సంస్థ ఇప్పటికే ప్రకటించింది, అవి కూడా రిపబ్లిక్ డే నుండి అమలులోకి వస్తాయి.