Home / Inspiring Stories / పాకిస్తాన్ కి చుక్కలు చూపించిన మన సైనికుడు.

పాకిస్తాన్ కి చుక్కలు చూపించిన మన సైనికుడు.

Author:

1971 లో పాకిస్థాన్ తో పాక్ ఆక్రమిత కాశ్మీర్ విషయంలో జరిగిన యుద్ధంలో పాక్ బలగాలు లొంగిపోవటం వల్ల కాశ్మీర్ లో కొన్ని ప్రాంతాలు పాకిస్థాన్ వశం అయ్యాయి, లేకపోతే మన సైనికుల దాటికి నీటి పాక్ ఆక్రమిత కాశ్మీర్ పూర్తిగా భారతదేశంలోనే ఉండేది, ఆ యుద్ధంలో మన సైనికులు ఎంతో వీరోచితంగా పోరాడి చాలా చోట్ల పాక్ బలగాలు వెనక్కి పారిపోయేలా చేసారు, రిచ్ మెన్ అనే సైనికుడి వ్యూహాల దాటికి పాకిస్థాన్ బలగాలకి చుక్కలు కనిపించాయి.

Indian-Army

పదిహేడేళ్ల వయసులోనే ఆర్మీలో చేరిన రిచ్ మెన్ 1947 – 48 లో పాకిస్థాన్ తో జరిగిన యుద్ధంలో కూడా పాల్గొన్నాడు, ఈ యుద్ధంలో లడాఖ్ ప్రాంతాన్ని ఆక్రమిచాలని వస్తున్న పాకిస్థాన్ బలగాల పన్నాగాన్నిపసిగట్టిన రిచ్ మెన్ పాక్ సైనికుల కంటే ముందే లడాఖ్ ప్రాంతాన్ని చేరుకోవాలని ఒక వ్యూహాన్ని రిచ్ మెన్ రచించాడు, అప్పుడే మంచు భారీగా కురుస్తోంది. ఏమాత్రం అజాగ్రత్తగా ఉన్నా మృత్యువాతపడటం ఖాయం. దీన్ని గమనించిన రిన్‌చెన్‌ తదితరులు జాగ్రత్తగా జొజిలా మార్గాన్ని దాటి లద్దాఖ్‌ రాజధాని లేహ్‌కు చేరుకున్నారు. భారతీయ సైనికుల ఉనికిని తెలుసుకున్న పాక్‌ దళాలు అక్కడికి వెళ్లే ఆలోచనను విరమించుకున్నాయి. భారత సైనికులు ఆ రోజున లద్దాఖ్‌ చేరకపోయివుంటే ఆ ప్రాంతం పాక్‌ స్వాధీనమైవుండేది.

1971 లో పాకిస్థాన్ తో జరిగిన యుద్ధంలో రిచ్ మెన్ తన ధైర్య సాహసాలతో పాకిస్థాన్ సైనికులకు చుక్కలు చూపించాడు, ఈ యుద్ధంలో ఎలాగైనా భారతదేశ వ్యూహాత్మక ప్రాంతాలని ఆక్రమించాలని పాకిస్థాన్ సైనికులు పావులు కదిపారు, రిచ్ మెన్ సారథ్యంలోని మన సైనికులు ఎన్నో విపత్కర పరిస్థితులను తట్టుకుని మంచులోయల గుండా పయనించి పాక్ బలగాలని తరిమికొట్టారు, రిచ్ మెన్ తన వ్యూహాలతో పాక్ సైనికుల్ని దారుణంగా దెబ్బకొట్టి వారు ఆక్రమించిన 1000 చ.కి.మీ భూమిని పాక్ ఆక్రమిత కాశ్మీర్ నుండి స్వాధీనం చేసుకొని భారత దేశంలో కలిపాడు, రిచ్ మెన్ పాకిస్థాన్ ని పూర్తిగా పాక్ ఆక్రమిత కాశ్మీర్ నుండి వెళ్ళగొట్టాలని అనేక వ్యూహాలను రచించాడు, కానీ పాక్ లొంగిపోవడంతో యుద్ధంలో భారత్ గెలిచింది, ఆ యుద్ధం ముగిసిన తరువాత జరిగిన ఒప్పందం వల్ల పాక్ ఆక్రమిత కాశ్మీర్ ని భారత్ స్వాధీనం చేసుకోలేక పోయింది, ఒకవేళ ఆ ఒప్పందం జరగపోయిఉంటే రిచ్ మెన్ దాటికి ఆ ప్రాంతమంతా మన దేశంలోనే కలిసి ఉండేది, అలా జరిగి ఉంటె ఈరోజు కాశ్మీర్ లో ఉన్న అశాంతి ఉండేది కాదు, కాశ్మీర్ కేంద్రంగా జరుగుతున్న ఉగ్రవాద కార్యకలాపాలు ఉండేవి కాదు.

రిచ్ మెన్ చేసిన సేవలకి  భారత ప్రభుత్వం మహావీరచక్ర అవార్డుతో సత్కరించింది, 1948 , 1971 లలో జరిగిన పాకిస్థాన్ యుద్ధంలతో పాటు 1962 , 1965 లలో జరిగిన చైనా యుద్ధంలోను రిచ్ మెన్ ఎంతో ధైర్యంతో పోరాడాడు, రిచ్ మెన్ పేరు వింటేనే సైనికులకు చెమటలు పట్టేవి, రిచ్ మెన్ ని ఎదిరించలేక శత్రు సైన్యాలు వెనుకకి వెళ్లిపోయేవి, రిచ్ మెన్ చూపించిన ధైర్యసాహసాలు వల్ల పాక్ ఆక్రమిత కాశ్మీర్ లోని కొన్ని ప్రాంతాలు పాక్ చేతిలోకి వెళ్లకుండా ప్రశాంతంగా ఉన్నాయి.

(Visited 511 times, 1 visits today)