అందరు అనుకున్నట్టుగానే ఇటలీలో ఈరోజు విరాట్ కోహ్లీ – అనుష్క శర్మల వివాహం జరిగిపోయింది, వీరిద్దరి పెళ్లి గురుంచి గత వారం రోజులుగా వార్తలు వస్తూనే ఉన్నాయి, అత్యంత సన్నిహితుల మధ్య సోమవారం ఇంటలీలోని టస్కలీలో విరుష్క జంట ఒక్కటైంది. ప్రపంచంలోనే అత్యంత ఖరీదైన హాలిడే స్పాట్లో వీరి పెళ్లి జరిగింది. ఇటలీలోని టస్కనీ ప్రాంతంలో కేవలం వంద మంది జనాభే నివసించే అతి చిన్న గ్రామమైన బిబియానోలో ఉన్న బోర్గో ఫినాచెజియో విల్లాలో ఈ వివాహ వేడుక జరిగింది. ఆహ్వానం అందిన వారిని మాత్రమే విల్లాలోకి అనుమతించే విధంగా కట్టుదిట్టమైన భద్రతను ఏర్పాటు చేసినట్లు తెలిసింది. పెళ్లి తర్వాత డిసెంబర్ 21న ఢిల్లీలో అంగరంగ వైభవంగా రిసెప్షన్ వేడుకను నిర్వహించనున్నారు. ఈ వేడుకకు బీసీసీఐ పెద్దలతో పాటు క్రికెట్, బాలీవుడ్లకు చెందిన అతిరథ మహారథులంతా హాజరుకానున్నారు. అయితే పెళ్లికి షారుఖ్ ఖాన్, అమిర్, సచిన్, యువరాజ్ లను ఆహ్వానించారని, వారు ఈ వేడుకలో హాజరవుతున్నట్టు వార్తలు వచ్చాయి. కానీ అవన్నీ నిజాలు కావని తేలిపోయింది.
పెళ్లి ఫోటోలను విరుష్క జంటనే ట్విట్టర్ లో పెట్టడంతో ఈ పెళ్లి గురుంచి అందరికి తెలిసింది, 2013 వ సంవత్సరంలో ఒక టీవీ యాడ్ షూటింగ్ ద్వారా పరిచయం అయిన వీరు ఆ పరిచయాన్నే ప్రేమగా మార్చుకొని ఇప్పుడు (Dec-11th) ఒక్కటయ్యారు…!