Home / Entertainment / ఆసక్తి రేకెత్తించిన “క్షణం” ట్రైలర్.

ఆసక్తి రేకెత్తించిన “క్షణం” ట్రైలర్.

Author:

అడివి శేష్, అదహ్ శర్మ హీరో, హీరోయిన్ లుగా పివిపి సినిమా బ్యానర్ లో వస్తున్న సినిమా “క్షణం”. ఈ సినిమా ట్రైలర్ ను హీరో మహేష్‌బాబు, సమంత  తమ చేతుల మీదుగా ఈ రోజు విడుదల చేశారు. బుల్లితెర యాంకర్ అనసుయ భరద్వాజ్ ఈ సినిమా లో క్రైమ్ ఇన్వెస్టిగేటర్ గా నటించింది. ఈ ట్రైలర్ ఆధ్యాంతం మంచి ట్విస్టులతో చూపరులను ఆకట్టుకుంది. సినిమా ప్లాట్ని జనాలకు పరిచయం చేసి అసలు సస్పెన్స్ని రివీల్ చేయకుండా ఒక మంచి ట్రైలర్ అనిపించుకుంది. అడివి శేష్, అదహ్ శర్మ మధ్య కెమిస్ట్రీ బాగా వర్క్ఔట్ అయినట్లు ఈ ట్రైలర్ ని చూస్తే తెలుస్తుంది. షూటింగ్ దాదాపు పూర్తి చేసుకున్న ఈ సినిమా మార్చ్ 4న ప్రేక్షకుల ముందుకు రానుంది. క్షణం సినిమా ట్రైలర్ మీకోసం.

(Visited 252 times, 1 visits today)