Home / Latest Alajadi / టీఆర్ఎస్ గెలుపుపై పవన్ రాసిన లేఖ ఇదే..! మహేష్ ఏమని ట్వీట్ చేసారంటే.!

టీఆర్ఎస్ గెలుపుపై పవన్ రాసిన లేఖ ఇదే..! మహేష్ ఏమని ట్వీట్ చేసారంటే.!

Author:

తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో తెలంగాణ రాష్ట్ర సమితి విజయభేరి మోగించింది. భారీ మెజారిటీతో తమకు తిరుగులేదని చాటింది. ఈ సందర్బంగా పలు సినీ ప్రముఖులు శుభాకాంక్షలు తెలియచేసారు. సినీ తారలు సోషల్‌ మీడియా ద్వారా విజేతలకు అభినందనలు తెలుపగా తాజాగా సూపర్‌ స్టార్‌ మహేష్‌​ బాబు కూడా తన స్నేహితుడు కేటీఆర్‌కు శుభాకాంక్షలు తెలిపాడు.

“ఘన విజయం సాధించినందుకు శుభాకాంక్షలు. మీరు అన్ని రకాలుగా ఈ విజయానికి అర్హులు. ఇక ముందు కూడా ప్రజల మనిషిగా కొనసాగండి” అంటూ ట్వీట్‌ చేశాడు మహేష్‌. గతంలో భారత్ అనే నేను ప్రొమోషన్స్ కేటీఆర్ వచ్చిన సంగతి అందరికి తెలిసిందే.

ఇది ఇలా ఉండగా…తెలంగాణ ఎన్నికల ఫలితాలపై జనసేన అధినేత పవన్ కళ్యాణ్ స్పందించారు. ఈ మేరకు ఫలితాలపై పవన్ ఓ లేఖను విడుదల చేశారు. ‘తెలంగాణ ముందస్తు ఎన్నికల్లో అఖండ విజయం సాధించిన గౌరవనీయులు శ్రీ కె.చంద్రశేఖర్ రావు గారికి నా తరపున, జనసేన శ్రేణుల తరపున హృదయపూర్వక శుభాభినందనలు తెలుపుతున్నాను.

ఈ తీర్పుతో తెలంగాణ ప్రజల విజ్ఞత మరోసారి రుజువైంది. తెలంగాణ కోసం త్యాగాలు చేసిన, తెలంగాణను తెచ్చిపెట్టిన తెలంగాణ రాష్ట్ర సమితికి, ఆ పార్టీ నాయకుడు శ్రీ కేసీఆర్‌కు తెలంగాణ ప్రజలు పట్టం కట్టి తమ మనసులోని మాటలను మరోసారి చాటి చెప్పారు. ఈ అఖండ విజయానికి సారధులైన శ్రీ కేసీఆర్ గారు, వారి కుమారుడు శ్రీ కేటీఆర్ గారికి మనస్ఫూర్తిగా అభినందనలు తెలుపుతున్నాను. తెలంగాణ ప్రజల ఆశలు, ఆకాంక్షలను కేసీఆర్ గారు నెరవేరుస్తారన్న నమ్మకం నాలో సంపూర్ణంగా ఉంది. ఈ ఎన్నికలలో అత్యధిక మెజార్టీతో గెలుపొందిన శ్రీ హరీష్ రావు గారికి నా శుభాకాంక్షలు. విజయం సాధించిన ప్రతి ఒక్కరితోపాటు టీఆర్ఎస్ నాయకులు, కార్యకర్తలకు నా అభినందనలు” అని లేఖలో పేర్కొన్నారు.

(Visited 1 times, 1 visits today)