Home / General / తన తల్లిని పట్టించుకోట్లేరని…భార్యలను తగులబెట్టాడు.

తన తల్లిని పట్టించుకోట్లేరని…భార్యలను తగులబెట్టాడు.

Author:

జైపూర్ కి చెందిన దీపారామ్ కి దరియాదేవి (25 ఏళ్ళు) , మాలీదేవి (27 ఏళ్ళు) అనే ఇద్దరు భార్యలున్నారు. వీరికి ముగ్గురు పిల్లలున్నారు. అయితే ఉద్యోగరీత్యా గుజరాత్ లో ఉండే దీపారామ్ తన తల్లిని సరిగా చూసుకోవాలని జైపూర్ లో ఉన్న తన భార్యలకు తరచూ చెబుతుండేవాడు. ఎన్నిసార్లు చెప్పినా తన తల్లి బాగోగులు పట్టించుకోకుండా నిర్లక్ష్యం చేస్తుండటంతో విసిగిపోయిన దీపారామ్ తన భార్యలను చంపాలని నిర్ణయించుకున్నాడు.

జైపూర్

మంగళవారం అనగా డిసెంబర్ 19 న గుజరాత్ నుండి ఇంటికి వచ్చిన దీపారామ్ బంగారం కొనిస్తానని చెప్పి తన ఇద్దరు భార్యలను కారులో బైటకి తీసుకెళ్లాడు..కారులో దీపారామ్ తల్లి విషయంలో ముగ్గురి మధ్య తీవ్రస్థాయిలో గొడవ జరిగింది, ఓ చోట ఇద్దరు భార్యల్లో ఒకరు కారు నుంచి దిగి అక్కడున్న వారి సాయం కోరడానికి ప్రయత్నించింది. దీంతో కోపంతో ఊగిపోయిన దీపారామ్.. మొదటి భార్యను బలవంతంగా కారులోకి నెట్టి కొంతదూరం తీసుకువెళ్లాడు. అక్కడ కారు ఆపి లాక్ చేశాడు. ఆ తర్వాత కారుని పెట్రోల్ పోసి తగులబెట్టాడు. ఈ ఘటనలో ఇద్దరు భార్యలు తీవ్రంగా గాయపడ్డారు. ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నారు. పరిస్థితి సీరియస్ గా ఉందని డాక్టర్లు తెలిపారు. నేరం చేసినట్లు అంగీకరించడంతో పోలీసులు భర్త దీపారాయ్ ను అరెస్ట్ చేశారు.

(Visited 783 times, 1 visits today)