ఇది రెండవ ప్రపంచ యుద్ద సమయంలోని పెళ్లి ఆహ్వాన పత్రిక.. దీనిని చూస్తుంటే అప్పటి వాస్తవ పరిస్థితి తెలుస్తుంది. శ్రీరస్తు-శుభమస్తు-ఆశీర్వమస్తు.. అని ప్రస్తుత ఆహ్వాన పత్రికలో చూస్తుంటాం దానికి భిన్నంగా అప్పటి పరిస్థితులకు అనుగుణంగా..శాంతి-స్వాతంత్ర్యం-అభ్యుదయం అనే జాతీయోధ్యమ మాటలను పత్రికలో ముద్రించారు. ఆహ్వాన పత్రిక స్టార్టింగ్ లోనే వందేమాతరం అనే జాతీమోధ్యమ నినాదాన్నికనిపిస్తుంది.
దయచేసి మీ రేషన్ బియ్యం ముందుగా పంపలాని కోరుచున్నామనే లైన్ చూస్తుంటే… అప్పటి ఆర్థిక పరిస్థితి కూడా తెలుస్తుంది. పెళ్ళికి వెళ్ళే అతిధులు మందుగానే వారి వంతు భియ్యాన్ని పెళ్లి ఇంటికి పంపే పరిస్థితి ఉండేది.