ప్రభుత్వ ఆసుపత్రులలో వైద్యం చేయించుకోవాలనుకుంటే భయపడే పరిస్థితి వచ్చింది, ప్రభుత్వ వైద్యుల నిర్లక్ష్యం కారణంగా గ్రామీణ ప్రాంతాలలో ప్రజలకి సరైన వైద్యం అందట్లేదు, ఈ పరిస్థితిని మార్చి ప్రజలకి మెరుగైన వైద్యం అందించేందుకు తెలంగాణ వైద్య శాఖా మంత్రి అధికారులకు కొన్ని సూచనలు చేసారు, ప్రభుత్వ ఆసుపత్రులలో రోగులకు ఉచితంగా మందులని పంపిణీ చేయాలనీ, రోగ నిర్ధారణ పరీక్షలన్నీ ఉచితంగా అందించేందుకు అవసరమైన బడ్జెట్ ప్రతిపాదనలు సిద్ధం చేయాలని ఆ శాఖ అధికారులను ఆదేశించారు వైద్యఆరోగ్యశాఖ మంత్రి లక్ష్మారెడ్డి, అన్ని ప్రభుత్వ ఆసుపత్రులలో ఆపరేషన్ థియేటర్ లని ఆధునీకరించి, అన్ని సౌకర్యాలని పెంచాలని , అన్ని రకాల రోగాలకి ప్రభుత్వ ఆసుపత్రులలోనే వైద్యం అందేలా సౌకర్యాలు ఉండేలా చేస్తాం అని ప్రకటించారు.
2017-18 బడ్జెట్ అంచనాలపై సమీక్ష సందర్భంగా పలు కీలక నిర్ణయాలు తీసుకోనున్నారు.