Home / Inspiring Stories / వాహనదారులకు గుడ్ న్యూస్…ఈ పెట్రోల్ ధర రూ.22 మాత్రమే..!

వాహనదారులకు గుడ్ న్యూస్…ఈ పెట్రోల్ ధర రూ.22 మాత్రమే..!

Author:

మన దేశంలో ఎక్కువగా మధ్య తరగతి ప్రజలే ఉన్నారు, ఏవైనా నిత్యావసరాల ధరలు పెరిగితే కచ్చితంగా ఎఫెక్ట్ పడితే మధ్య తరగతి ప్రజల మీదనే, ఉల్లిగడ్డల రేట్ పెరిగిన, కూరగాయల రేట్ పెరిగిన, పెట్రోల్ రేట్ పెరిగిన, బస్, రైల్వే చార్జీలు పెరిగిన మధ్య తరగతి, పేద ప్రజలే నష్టపోతుంటారు, ప్రస్తుతం పెట్రోల్, డీజిల్ రేట్ లు రోజురోజుకి పెరిగిపోతూనే ఉన్నాయి, అప్పుడప్పుడు పెట్రోల్ రేట్ తగ్గినా మళ్లీ పెట్రోల్ రేటును పెంచుతున్నారు. దీంతో పెరిగిన రేట్ల‌తో జ‌నాలు వాహ‌నాల‌ను న‌డ‌ప‌లేక‌పోతున్నారు.అయితే త్వ‌ర‌లో ఈ బాధ‌లు జ‌నాల‌కు తీర‌నున్నాయి. అంటే.. పెట్రోల్ ధ‌ర‌లు తగ్గిస్తారా..? అంటే.. లేదు.. కానీ పెట్రోల్‌కు ప్రత్యామ్నాయంగా మ‌రో త‌ర‌హా ఇంధ‌నాన్ని అందుబాటులోకి తేనున్నారు. దాని పేరు మిథ‌నాల్‌. త్వ‌ర‌లో పెట్రోల్ త‌ర‌హాలో మిథ‌నాల్‌ను విక్ర‌యించ‌నున్నారు. దీంతో లీట‌ర్ మిథనాల్ ఇంధ‌నం రూ.22 మాత్ర‌మే అవుతుంది. ఫ‌లితంగా పెట్రోల్ కి డిమాండ్ తగ్గి రేట్లు కూడా దిగి వ‌స్తాయ‌ట‌.

మిథనాల్

కేంద్ర ప్ర‌భుత్వం తాజాగా మిథ‌నాల్ పాల‌సీని ప్ర‌క‌టించింది. దీని వ‌ల్ల బొగ్గు నుంచి ఉత్ప‌త్తి అయ్యే మిథ‌నాల్ మిశ్ర‌మాన్ని 15 శాతం మోతాదులో పెట్రోల్‌లో క‌లుపుతారు. దీంతో మిథ‌నాల్ ఇంధ‌నం త‌యార‌వుతుంది. ఇక ఇలా త‌యారైన ఇంధనం ధ‌ర లీట‌ర్‌కు రూ.22 మాత్ర‌మే అవుతుంది. చైనాలో రూ.17కే ఈ ఇంధ‌నాన్ని త‌యారు చేస్తున్నారు. దీంతో ఇలా త‌క్కువ రేటుకే త్వ‌ర‌లో భార‌త్‌లోనూ మిథ‌నాల్‌ను త‌యారు చేయ‌నున్నారు.

మ‌న దేశంలో దీప‌క్ ఫెర్టిలైజ‌ర్స్‌, రాష్ట్రీయ కెమిక‌ల్స్ అండ్ ఫెర్టిలైజ‌ర్స్ (ఆర్సీఎఫ్‌) స‌హా ముంబై చుట్టు ప‌క్క‌ల ఉన్న చాలా క‌ర్మాగారాలు మిథనాల్‌ను ఉత్ప‌త్తి చేసే సామ‌ర్థ్యాన్ని క‌లిగి ఉన్నాయి. అయితే స్వీడన్‌ ఆటో మేజర్‌ వోల్వో కంపెనీ మిథనాల్‌తో నడిచే స్పెషల్ ఇంజిన్‌ను కూడా రూపొందించింది. దీంతో లోకల్‌గా తయారైన ఇంధనంతో 25 బస్సులను త్వరలో నడపనున్నారు. త్వరలోనే ఈ ప్రయోగాన్ని దేశ వ్యాప్తంగా అమలు చేయడానికి కేంద్రం ప్లాన్ చేస్తోంది. ఈ క్ర‌మంలో మిథ‌నాల్‌ను వాడ‌డం వ‌ల్ల పెట్రోల్ ధ‌ర‌లు కూడా త‌గ్గుతాయ‌ని అంటున్నారు. అయితే మిథ‌నాల్ వ‌ల్ల మ‌న‌కు క‌లిగే లాభాలు ఏమిటంటే… ఈ ఇంధ‌నంతో ఇంజిన్ నుంచి శ‌బ్దం ఎక్కువగా రాదు. వాహ‌నం నుంచి పొగ కూడా రాకుండా ఉంటుంది. కాలుష్యం త‌క్కువ‌వుతుంది. పైగా వాహ‌నం మైలేజీ పెరుగుతుంది. కాకపోతే ఇప్పుడు ఉన్న వాహనాల ఇంజిన్ లు మిథనాల్ పోస్తే పని చేస్తాయో లేదో అనే దానిపై స్పష్టత లేదు, కాకపోతే పెట్రోల్, డీజిల్ ఇంజిన్ లాగానే మిథనాల్ ఇంజన్ లు తయారుచేయడానికి కంపెనీలు ముందుకువచ్చాయి, అయితే మిథ‌నాల్ ఎప్ప‌టి నుంచి మ‌న‌కు అందుబాటులోకి వ‌స్తుందో వేచి చూడాలి..!

Also Read: న్యూ ఇయర్ కి “డీజే” పర్మిషన్ ఇవ్వమని అడిగాడు..! కేటీఆర్ ఇచ్చిన రిప్లై హైలైట్ అసలు..!

(Visited 630 times, 1 visits today)