Home / Entertainment / మొత్తం అతనే చేసాడు..

మొత్తం అతనే చేసాడు..

Author:

బోల్డ్ బ్యూటీ అనుష్క కి పిచ్చికోపం వచ్చేసిందట ముద్దు గా ఉండే మొహం కోపంతో ఎర్రబడుతోందట ఏవరిమీదా అంతకోపం అనుకుంటున్నారా? రుద్రమ దేవి డైరెక్టర్ గుణశేఖర్ పై నట. ఈ అమ్మడి తో ప్రతిష్టాత్మ కంగా “రుద్రమ దేవి” చిత్రాన్ని తెరకెక్కించిన సంగతి తెలిసిందే కదా..! ఇప్పటికే ఈ సినిమా విడుదల చాలా ఆలస్యమైపోయింది. భాహుబలి లాంటి సినిమా వచ్చిన వెంటనే అంతే భారీ చిత్రంగా “రుద్రమ దేవికి” చాలానే పేరొచ్చింది.ఇంకా ఆలస్యం అవకుండా ఉంటే ఈ హైప్ లోనే సినిమాని రిలీజ్ చేస్తే బావుండేది. కానీ కొన్ని అనుకోని కారణాల వల్ల సినిమా మళ్ళీ మళ్ళీ వాయిదాపడుతూనే ఉంది. ఐతే రుద్రమదేవి పూర్తి చేసిన వెంటనే ప్రకాష్ కొవెల మూడి దర్శకత్వంలో వస్తున్న సైజ్ జీరో లో నటించారు అనుష్క.ఆర్య హీరోగా తెలుగు తమిళ భాషల్లో వస్తున్న ఈ సినిమా కోసం లావెక్కీ సన్నబడీ తన అందాల్ని భారీగా చూపించీ చాలానే కష్టపడ్డ అనుష్క ఈ సినిమాని కూడా తన కెరీర్ లో ముఖ్యమైన సినిమాగా నిలబడు తుందని భావిస్తోందట. అందుకే సైజ్ జీరో ప్రమోషన్లలో కూడా బాగానే పాల్గొంటోంది.

ఐతే ఇప్పుడొచ్చిన చిక్కేమిటంటే ఈ అక్టోబర్ రెండు న సైజ్ జీరో చిత్రం ప్రేక్షకులముందుకి రాబోతోంది. ఐతే ఇన్నాళ్ళూ వాయిదాలు పడుతూ వచ్చిన “రుద్రమదేవి” ని కూడా అక్టోబర్ లోనే 9 న విడుదల చేయబోతున్నాడట గుణశేఖర్. దాంతో తన కెరీర్ లోనే దాదాపు తనే ముఖ్య పాత్రగా ఉన్న కీలక సినిమాల్లో ఏదో ఒకటి బాక్సాఫీస్ దగ్గర తగ్గిపోయే అవ్కాశం ఉంది. అలా అని ఇంకా లేట్ చేస్తే రుద్రమ దేవి మీద ఉన్న ఇంట్రస్ట్ తగ్గిపోయి అలాకూడా ఆ సినిమా బోల్తా పడే అవకాశం ఉంది… దాంతో గుణశేఖర్ పై కారాలూ మిరియాలూ నూరుతోందట అనుష్క

(Visited 62 times, 1 visits today)