క్రికెట్ అభిమానులకి మహేంద్ర సింగ్ ధోని చాలా పెద్ద షాక్ ఇచ్చాడు, ఇప్పటికే టెస్టుల నుండి రిటైర్మెంట్ ప్రకటించిన ధోని ఈరోజు వన్డే, టీట్వంటీ టీమ్ కెప్టెన్సీ నుండి తప్పుకున్నాడు, ఇక టీమ్ లో ఒక ఆటగాడిగా మాత్రమే ఉంటాడు, ఇంగ్లాండ్ తో జరిగే వన్డే, టీట్వంటీ మ్యాచ్ లకి ప్రస్తుత టెస్ట్ కెప్టెన్ విరాట్ కోహ్లీ యే కెప్టెన్ గా ఉండనున్నాడు, కెప్టెన్సీ కి ధోని గుడ్ బై చెప్పినట్టు బిసిసిఐ ట్విట్టర్ ద్వారా ప్రకటించింది,2007లో కెప్టెన్సీ బాధ్యతలు చేపట్టిన ధోనీ జట్టును ఏకతాటిపై నడిపించి సక్సెస్ఫుల్ స్కిప్పర్గా పేరు తెచ్చుకున్నాడు. ఇప్పడు నాటకీయంగా కెప్టెన్సీ బాధ్యతల నుంచి తప్పుకుంటున్నట్లు ప్రకటించడం వెనుక ధోనీ అంతరగం ఏమిటో అర్ధం కావడం లేదని క్రికెట్ విశ్లేషకులు అంటున్నారు. మహేంద్ర సింగ్ ధోని అనూహ్య నిర్ణయంతో ధోని అభిమానులు సోషల్ మీడియాలో తమ భాధని వ్యక్తపరుస్తున్నారు.
NEWS ALERT – Mahendra Singh #Dhoni steps down as #Captain of #TeamIndia. He will be available for selection for ODIs & T20Is vs England pic.twitter.com/2xM0eisdjq
— BCCI (@BCCI) January 4, 2017