తెలుగు బిగ్ బాస్ సీజన్ -2 ఇవాళ గ్రాండ్ గా ముగిసింది. విన్నర్ గా కౌశల్ నిలిచాడు. చీఫ్ గెస్ట్ గా వచ్చిన విక్టరీ వెంకటేష్ చేతులమీదుగా రూ. 50 లక్షల క్యాష్ ను అందుకున్నాడు కౌశల్. తర్వాత బిగ్ బాస్ తెలుగు సీజన్ 2 కు బై బై చెప్పేశాడు నాని.
ఈ సందర్భంగా సోషల్ మీడియాలో ఓ పోస్ట్ చేశాడు.
‘ఇవాళ ఫైనలే.. వ్యాఖ్యాతగా నా చివరి రోజు. నా వరకు ది బెస్ట్ ఇచ్చాను. ఇది ఓ అద్భుతమైన అనుభూతి. చాలా నేర్చుకున్నా, చాలా నేర్చుకోలేదు. వ్యాఖ్యాతగా నన్ను, షోను ఇష్టపడ్డవారికి ధన్యవాదాలు. నేను వ్యాఖ్యాతగా నచ్చని వారికి.. మనం థియేటర్లో కలుద్దాం(నవ్వుతూ). ‘బిగ్బాస్’కు ఇక సెలవు’ అని నాని పోస్ట్లో పేర్కొన్నారు.