Home / Devotional / భద్రాద్రి రాముడికి మరింత భద్రత

భద్రాద్రి రాముడికి మరింత భద్రత

Author:

భద్రాద్రి రాముడికి మరింత భద్రత పెంచనున్నట్లు ప్రభుత్వం ప్రకటించింది. ఇక భద్రాచలం ప్రధాన ఆలయం, పరిసరాలన్నీ మరింత భద్రతా వలయం లోకి వెళ్లనున్నాయి. ఇకపై భద్రాద్రి రామయ్య సందర్శన కోసం రానున్న భక్తులకు కూడా కొన్ని ఆంక్షలు విధించనున్నారు.

bhadrachalam temple

రామాలయం లోకి ఇక భక్తులు ఎవరూ సెల్ ఫోన్లను తీసుకుని వెళ్ళరాదు. బయటే ప్రత్యేకంగా ఏర్పాటు చేసిన కౌంటర్ లో 5 రూపాయలు చెల్లించి సెల్ ఫోన్లు, కెమెరాలను భద్రపరచుకోవచ్చని భద్రాద్రి ఈ వో ప్రభాకర్ శ్రీనివాస్ తెలిపారు. లగేజీ భద్రపరచుకోవడం కోసం ఆలయం దగ్గరలోనే క్లాక్ రూమ్ సౌకర్యం కూడా ఉంది. 10 రూపాయలు చెల్లించి వెంట తెచ్చుకున్న బ్యాగులు, లగేజీలు క్లాక్ రూమ్ లో భద్రపరచుకోవచ్చు. జూన్ 16 నుంచి ఈ ఆంక్షలు అమల్లోకి రానున్నాయని ఈవో ఒక ప్రకటనలో తెలిపారు.

(Visited 126 times, 1 visits today)