Home / Political / ఓదార్పు యాత్ర కంటిన్యూస్..

ఓదార్పు యాత్ర కంటిన్యూస్..

Author:

వైఎస్ ఫ్యామిలీ ఓదార్పు యాత్ర .. దాదాపు ఐదు సంవత్సరాల కిందట మొదలైన ఈ ఓదార్పు వ్యవహారం ఇంకా కొనసాగుతూనే ఉంది. తొలి విడతలో వైఎస్ జగన్ ప్రారంభించి పలు విడతల వారీగా కొనసాగించిన సీరియల్ ఇప్పుడు వైఎస్ షర్మిల ఆధ్వర్యంలో కొనసాగుతున్న విషయం తెలిసిందే. ఇందులో భాగంగా ఆమె రంగారెడ్డి జిల్లాలో పర్యటించనున్నట్టుగా తెలుస్తోంది.ఈ నెల 24 వ తేదీ నుంచి వైఎస్ షర్మిల రంగారెడ్డి జిల్లాలో ఓదార్పు యాత్రను చేపడుతుందని వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ ప్రకటించింది. ఐదు రోజుల పాటు ఆమె జిల్లా వ్యాప్తంగా పర్యటించి మొత్తం 30 కిపైగా కుటుంబాలను ఓదారుస్తుందని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తెలంగాణ విభాగం నేతలు తెలిపారు. ఆంధ్రలో దాదాపుగా ఓదార్పు యాత్రను పూర్తి చేసి.. తెలంగాణలో వైఎస్ మరణాన్ని తట్టుకోలేక మరణించిన వారి కుటుంబాలను ఓదార్చే బాధ్యతను జగన్ షర్మిలకు అప్పగించిన విషయం తెలిసిందే.ఇందులో భాగంగా ఇప్పటికే పలు విడతలుగా షర్మిల ఓదార్పు యాత్రను చేపట్టింది. ఇప్పుడు మరో విడత కు రంగం సిద్ధం  చేసింది. మరి ఈ వైఎస్ ఫ్యామిలీ ఓదార్పు యాత్ర ఇంకెన్నాళ్ళు కొనసాగిస్తారనేది క్లారిటీ లేని అంశం. దీన్ని వీలయినంత త్వరగా ఆపేస్తే మంచిదని, ఏ విషయాన్నయినా మరీ సాగదీయరాదని కొందరు పొలిటిషన్స్  సలహా ఇస్తున్నారు..

 

(Visited 18 times, 1 visits today)