చెన్నై నగరం అలుపెరుగని వర్షాలతో అతళాకుతలం అయ్యింది. రోడ్లు అన్ని నీటితో నిండి ప్రయాణానికి ఇబ్బందిగా మారిపోయాయి. ఈ సందర్భంలో ప్రజలని ఆదుకొనేందుకు ఒలా క్యాబ్స్ వినూత్న ఆలోచనతో ముందుకు వచ్చింది. వరదలో చిక్కుకున్న వారికి, రోడ్లు నీటితో నిండి ఉన్న ప్రాంతాల వారికి ఉచిత పడవ ప్రయాణం అందించడం ప్రారంభించింది. ఇందుకోసం మత్స్యకారులతోనూ, ప్రొఫెషనల్ రోవర్స్తోనూ పడవలని నడిపిస్తున్నారు. ప్రతి పడవలో ఇద్దరు నావికులు, గొడుగులు, అత్యవసర పదార్దాలు ఉంటాయి.
ఈ పడవల ద్వారా ప్రజలకు త్రాగు నీరు, ఆహారం అందివ్వడమే కాకుండా ప్రతి ట్రిప్ కి 5 నుండి 9 మందిని సురక్షిత ప్రాంతాలకి తరలిస్తున్నారు. ఈ పడవలని ఇంకో మూడు రోజులు నడుపుతామని, అప్పటికీ వర్షాలు తగ్గకపోతే ఇంకా పొడిగిస్తామని ఒలా ప్రథినిదులు తెలిపారు. ఎవరైన లోతట్టు ప్రాంతాలలో ఉంటే తమ సర్విస్ని ఉచితంగా ఉపయోగించుకోవచ్చు అని తెలిపారు. ఏది ఏమైన ప్రజలు ఆపదలో ఉన్నప్పుడు వారి అవసారాన్ని అర్దం చేసుకొని సాయం చేస్తున్న ఒలా క్యాబ్స్ వారికి కృతజ్ఞతలు.