గత పది రోజులుగా తమిళనాడులో జరుగుతున్న రాజకీయ సంక్షోభం ఒక కొలిక్కికి వచ్చింది, ముఖ్యమంత్రి పీఠం అధిష్టించాలని ఎంతో ఆరాటపడిన చిన్నమ్మ శశికళ సుప్రీం కోర్ట్ తీర్పుతో జైలుకి వెళ్లాల్సి వచ్చింది, శశికళ జైలుకి వెళ్లడంతో ఎమ్మెల్యేలు అంత పన్నీర్ సెల్వంకే మద్దతు ఇస్తారు అని అందరు భావిస్తున్న సమయంలో శశికళ నమ్మిన బంటు అయిన పళనీసామి పేరు తెరమీదకి వచ్చింది, ఇన్ని రోజులు శశికళకి మద్దతు ప్రకటించిన ఎమ్మెల్యేలు అంత పళనీసామి వెనకాలే ఉండటంతో పళనీసామి గవర్నర్ దగ్గరికి వెళ్లి బలాన్ని నిరూపించుకున్నారు, గవర్నర్ విద్య సాగర్ రావు ప్రభుత్వ ఏర్పాటుకు పళనీ సామిని ఆహ్వానించారు.
గవర్నర్ విద్య సాగర్ రావు నిర్ణయంతో పన్నీర్ స్వామి వర్గం డీలా పడింది, ఈరోజు సాయంతం 4 గంటలకు ముఖ్యమంత్రిగా పళనిస్వామి ప్రమాణ స్వీకారం చేయబోతున్నారు, ముఖ్యమంత్రి బాధ్యతలు చేపట్టిన తరువాత తన బలాన్ని నిరూపించుకోవాల్సి ఉంటుంది.