Home / Inspiring Stories / ప్రత్యేక హోదా పై మోడీని హెచ్చరించిన పవన్ కళ్యాణ్.

ప్రత్యేక హోదా పై మోడీని హెచ్చరించిన పవన్ కళ్యాణ్.

Author:

Pawan Kalyan Special Status

ఆంధ్రప్రదేశ్ కి ప్రత్యేక హోదా అవసరం లేదని కేంద్ర మంత్రి స్పష్టం చేయడంతో ఆంధ్ర ప్రజలు బిజెపి పై ఆగ్రహంగా ఉన్నారు, ఎన్నికల సందర్భంగా ఇచ్చిన ప్రత్యేక హోదా హామీని ఖచ్చితంగా అమలు చేయాలనీ డిమాండ్ చేస్తున్నారు, కాని వారి డిమాండ్ ని కేంద్ర ప్రభుత్వం ఏమాత్రం పట్టించుకోవడం లేదు, ఇలాంటి సమయంలో జనసేన అధినేత పవన్ కళ్యాణ్ ట్వీట్ ద్వారా కేంద్రాన్ని హెచ్చరించారు.

పవన్ కళ్యాణ్ ట్వీట్ ద్వారా ఏమన్నారంటే అయన మాటల్లోనే “సరిగ్గా రెండు సంవత్సరాల కింద సీమాంద్ర ఎంపిలని తన్ని- పార్లమెంట్ లోంచి బయటకు గెంటి- ఉమ్మడి రాష్ట్రాన్ని అడ్డగోలుగా విడగొట్టి- కాంగ్రెస్ పార్టీ ఒక ఘోరమైన తప్పు చేసింది. ఆ రోజు సీమాంద్ర ప్రజలకి జరిగిన అవమానం- ఎవరు మరిచిపోలేదు- మరిచిపోరు కూడా, ఈ రోజు ప్రత్యేక హోదా విషయంలో ఇచ్చిన మాట మీద వెనక్కి తగ్గి, సీమంధ్ర ప్రజల నమ్మకం మీద కొట్టి బిజెపి కూడా అలంటి తప్పు వైపే అడుగులు వెయ్యకోడదని నేను కోరుకుంటున్నాను.’Special Status ‘ గురుంచి- ప్రజలు రోడ్ల మీదకి వచ్చి ఉద్యమించే లోపే అధికార పార్టీ ఎంపిలు ప్రతిపక్షాలను కూడా కలుపుకొని పార్లమెంట్ లో దీని మీద పోరాటం చేయాలనీ సీమాంద్ర ప్రజల తరుపున నా విన్నపం.

(Visited 1,182 times, 1 visits today)