ప్రియురాలు మరణాన్ని తట్టుకోలేక మనస్తాపంతో యువకుడు ఉరి వేసుకుని ఆత్మహత్య చేసుకున్నాడు. ఈ ఘటన మిళనాడులోని చిదంబరం గ్రామంలో చోటుచేసుకుంది. వివరాలలోకి వెళ్తే..కడలూరు జిల్లా చిదంబరం పరమేశ్వరనల్లూర్ సొక్కలింగం నగర్కు చెందిన నారాయణన్ కుమారుడు వైతీశ్వరన్ (22). చిన్న వయస్సులోనే వైతీశ్వరన్ తల్లిదండ్రులను కోల్పోవడంతో చిన్నాన్న శరవణమురుగన్ వద్ద పెరుగుతున్నాడు. బీఎస్సీ కంప్యూటర్ సైన్స్ చదివిన వైతీశ్వరన్ విదేశంలో పని చేసి కొన్ని నెలల కిందట సొంత ఊరికి వచ్చాడు. తరువాత అతను విదేశానికి వెళ్లలేదు.
కీళమూంగిలడిలోని ఓ ప్రైవేటు కళాశాలలో బీఎస్సీ తృతీయ సంవత్సరం చదువుతున్న రత్తినప్రియ (21) అనే యువతిని గతకొంతకాలంగా ప్రేమిస్తున్నాడు. ఆమె ఇంటి దగ్గర ఉన్న సమయంలో ప్రియుడుతో ఫోన్లో రహస్యంగా మాట్లాడుతున్నప్పడు తల్లి ఇంధ్ర (45) చూసి మందలించింది. దీంతో మనస్తాపం చెందిన ఆమె గదిలోని ఫ్యా న్కు ఉరి వేసుకుని ఆత్మహత్య చేసుకుంది.
ఆమె అంత్యక్రియలకు వెళ్లి వచ్చాడు. ఆపై రాత్రి పూట, ఇంట్లోని ఫ్యాన్ కు ఉరేసుకుని మరణించాడు. విషయం తెలుసుకున్న పోలీసులు, అతని మృతదేహాన్ని పోస్టుమార్టం గదికి తరలించారు. ఆపై మృతదేహం కోసం వైదీశ్వరన్ బంధుమిత్రులు రాగా, అతని మృతదేహాన్ని ఎలుకలు కొరికినట్టు కనిపించింది. దీంతో వారంతా ఆసుపత్రి ముందు నిరసనలకు దిగారు. పోలీసులు సర్దిచెప్పడంతో ఆందోళన విరమించారు.