తెలుగు సినిమా పరిశ్రమలో అంచెలంచెలుగా ఎదుగుతూ అగ్రనిర్మాతగా పేరు తెచ్చుకున్న దిల్ రాజు కుటుంబం ఒక విషాదం చోటుచేసుకుంది, దిల్ రాజు గారి సతీమణి ఈరోజు గుండె నొప్పితో మరణించారు, ఆమె వయసు 44 ఏళ్లు మాత్రమే కావడం గమనార్హం. అనారోగ్యంతో బాధపడుతున్న ఆమెను ఓ ప్రైవేటు ఆసుపత్రికి తీసుకెళ్లగా అక్కడ గుండెపోటు వచ్చి ప్రాణాలు కోల్పోయినట్లు తెలుస్తోంది.
భార్య మృతి విషయం తెలుసుకున్న దిల్ రాజు అమెరికా నుండి హుటాహుటిన హైదరాబాద్ కి బయలుదేరారు, ఈ సంవత్సరం శతమానం భవతి.. నేను లోకల్ లాంటి సూపర్ హిట్లతో దిల్ రాజు చాలా సంతోషంగా ఉన్న సమయంలో ఈ విషాదం చోటు చేసుకోవడం బాధాకరమైన విషయం.